Maharashtra: అన్నా హజారేతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ..
- అహల్యా నగర్లో పర్యటించిన సీఎం ఫడ్నవీస్
- అన్నా హజారేను కలిసిన ముఖ్యమంత్రి
- ఆశీర్వాదం తీసుకున్న దేవేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు అహల్యా నగర్లో సీనియర్ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారేతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ అన్నా హజారేతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఉన్నారు. సీఎం దేవేంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోను పంచుకున్నారు.
READ MORE: Health and Fitness: వేగంగా నడిస్తే ఎన్ని లాభాలంటే?.. అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇందులో ఆయన అన్నా హజారేతో కరచాలనం చేస్తూ.. తల వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే కూడా సీఎం చేయి పట్టుకుని ఆయనతో మాట్లాడి ఆశీస్సులు ఇస్తున్నట్లు చూడొచ్చు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం అహల్యా నగర్లో పర్యటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా అహ్మద్నగర్కి వచ్చారు. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు అన్నా హజారే హెలిప్యాడ్కు చేరుకున్నారు. సీఎం హెలికాప్టర్ నుంచి దిగగానే అన్నా హజారే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఫడ్నవీస్ ఆయనకు వంగి నమస్కరించారు.
READ MORE:UP: 18 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడ్డ 51ఏళ్ల మహిళ.. చివరికీ..
కాగా.. మహారాష్ట్రలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం సాధించింది. తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రుల శాఖలను కేటాయించారు. అతి ముఖ్యమైన హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఫడ్నవీస్ ఇంధనం, చట్టం, న్యాయవ్యవస్థ, సాధారణ పరిపాలన విభాగం, సమాచార, ప్రచార శాఖలను కూడా నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) శాఖను కేటాయించగా, అజిత్ పవార్కు ఫైనాన్స్, ప్లానింగ్, స్టేట్ ఎక్సైజ్ శాఖలు కేటాయించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!