Man Kills Son: రెండో భార్యతో గొడవ.. కొడుకును కత్తితో గొంతుకోసి చంపిన కసాయి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Son: సవతి తల్లి ఒత్తిడి కారణంగా ఏడేళ్ల బాలుడిని నిద్రలోనే తండ్రి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన రెండవ భార్యతో గొడవల కారణంగా తన 7 ఏళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. జిల్లాలోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింబోడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని ప్రతీక్ ముండేగా గుర్తించారు. నిందితుడిని శశిపాల్ ముండే (26)గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. మొదటి భార్యకు పుట్టిన కొడుకు వల్ల రెండో భార్యతో గొడవలు వస్తుండటంతో.. అతడిని అడ్డుతొలగించుకునేందుకు కన్నతండ్రే అంతమొందించాడు. రెండో భార్య కాపురానికి రావట్లేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. ఇండోర్ జిల్లాలోని తేజాజీ నగర్ ఏరియాలో శశిపాల్ ముండే (26) నివాసముంటున్నాడు. అతని మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. వారికి ఏడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. మొదటి భార్య చనిపోవడంతో.. శశిపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య కొడుకుని చూసుకోవడంలో రెండో భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లాడిని తాను చూసుకోలేనని తేల్చి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ పిల్లాడు ఇంట్లో ఉన్నంతవరకూ తాను కాపురానికి రాబోనని స్పష్టం చేసింది. రెండో భార్య చేష్టలకు విసిగిపోయిన శశిపాల్.. కొడుకును అడ్డుతొలగించుకోవాలని భావించాడు.
Also Read
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
3వ తరగతి చదువుతున్న ప్రతీక్ సాధారణంగా తన తాతయ్యతో కలిసి పడుకునేవాడు. ఆదివారం అతని తండ్రి శశిపాల్ ముండే, కూలర్ ఉన్న తన గదిలో పడుకోమని చెప్పాడు. కూలర్ గురించి ఉత్సాహంగా ఉన్న బాలుడు, తన తండ్రి గదికి వెళుతున్నట్లు తన తాతకు చెప్పాడు. అదే వాళ్లు అతన్ని సజీవంగా చివరిసారిగా చూడడమని పోలీసులు వెల్లడించారు. కొడుకు నిద్రపోవడంతో శశిపాల్ టీవీ వాల్యూమ్ పెంచి కత్తితో గొంతు కోసం హత్య చేశాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంధువుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్నట్లు తేజాజీ నగర్ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ తన్వర్ తెలిపారు. నిందితుడి గురించి ఏదైనా సమాచారం వస్తే తెలియజేయాలని ప్రాంత స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Google : గూగుల్లో సెర్చ్ చేసి లవర్ మర్డర్ ప్లాన్.. ముక్కలుగా కోసి పెరట్లోనే పాతాడు
ఇదిలా ఉండగా.. రెండో భార్య పాయల్కు కూడా ఓ మగబిడ్డ జన్మించాడు. శశిపాల్ తన కొడుకు ప్రతీక్ను వదిలించుకుంటే తప్ప ఆమె తన తల్లిదండ్రుల ఇంటి నుండి తిరిగి రాదని శశిపాల్కి చెప్పింది. తన కుమారుడిని చంపేటప్పుడు శశిపాల్ రుజువు కోసం వీడియో కూడా తీశాడు. ఆ వీడియోను ఆమెకు పంపించాడు. ఆమె అతని మొబైల్ నంబర్ను బ్లాక్ చేసినందున ఆమె దానిని చూడలేకపోయింది. శశిపాల్ ముండే మొబైల్ ఫోన్లో హత్యకు సంబంధించిన వీడియో క్లిప్ లభ్యమైంది. ఈ నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రెండో భార్య పాయల్ వ్యాఖ్యానించింది. తన ఏడేళ్ల కుమారుడిని చంపమని తన భర్తకు ఎప్పుడూ చెప్పలేదని ఆమె మీడియాతో అన్నారు.
తాజావార్తలు
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!