Machani Somnath: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాచాని సోమనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఎన్నికల్లో.. టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ (గురువారం) ఎమ్మిగనూరు పట్టణంలోని 25వ వార్డు, గాంధీనగర్ నందు బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్ట పెట్టినందుకు ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని మాచాని సోమనాథ్ తెలిపారు.
Read Also: PM Modi Visit to Telangana: రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్గిరిలో రోడ్షో
Also Read
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
అయితే, ప్రచారంలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తున్నారని ఎమ్మిగనూర్ టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో బటన్ ను నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. గాంధీనగర్ లో లాండ్రీ షాపు నందు డాక్టర్ మాచాని సోమనాథ్ బట్టలను ఇస్త్రీ చేశారు. బీసీ డిక్లరేషన్ లో ఆదరణ పథకం కింద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించుటకు చంద్రబాబు భరోసా కల్పించారని రజకునికి ఆయన వివరించారు. జగన్ రెడ్డి అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188 కోట్ల రూపాయల భారం మోపారు అని డాక్టర్ మాచాని సోమనాథ్ ఆవేదన చెందారు.
Read Also: Ravikula Raghurama: రవికుల రఘురామ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి..
కాగా, 73 ఏళ్ల చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 7000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే చంద్రబాబు ఒక్కరే 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత దక్కిందని డాక్టర్ మాచాని సోమనాథ్ అన్నారు. చంద్రబాబు “విజన్” ఉన్న నాయకుడు.. జగన్ “రీజన్” లేని నాయకుడు.. రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆయన మండిపడ్డారు. రాక్షస పాలనను, రాచరిక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కదిరికోట ఆదెన్న, కేఎండి అబ్దుల్ జబ్బార్, చేనేత విభాగం నాయకులు లక్ష్మీరెడ్డి, కుర్ని దేవదాయ సంఘం సెక్రెటరీ సుధాకర్, కామర్తి గంగాధర్, ధణ, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, కంపాడు చిన్న రంగన్న, వన్నెల మోషే, ఆఫ్గాన్ వలి భాష తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..