PM Modi Visit to Telangana: రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్గిరిలో రోడ్షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi visit to Telangana: త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండోసారి రాష్ట్రానికి రావడం తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగుతాయన్న సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోcw ఈ నెల 15న మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి స్థానంపై దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ సీటుతోపాటు మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై దృష్టి సారించిన కమలదళం.. జాతీయ నేతలను ప్రచారంలో దింపుతోంది. రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు. పదిరోజుల్లోనే రెండోసారి ప్రధాని రాష్ట్రానికి రావడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
Read also: Ravikula Raghurama: రవికుల రఘురామ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి..
Also Read
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
- Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తోంది. మల్కాజిగిరిలో దాదాపు 5 కి.మీ మేర ప్రధాని రోడ్ షో ప్లాన్ చేశారు. ఇక నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజిగిరిలో జరిగే సభలో మోడీ పాల్గొంటారు. దీంతో మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు 5 కి.మీ. పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్లను నడపరాదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు ఐపీసీ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. మోడీ పర్యటనలు బీజేపీకి ఏమైనా లాభిస్తాయా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టిన బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
తాజావార్తలు
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!