Machani Somanath : రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబు రావాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు,ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు. పల్లెలు కరువు కోరల్లో చిక్కుకొని వలసలు బాట పట్టారని, పశుగ్రాసం లేక పశువులను కమేళ్ళాలకు విక్రయిస్తున్నామని ఓ రైతు ఆవేదన తో డా. మాచాని సోమనాథ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు శరణ్యంగా మారాయని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ.. జగన్ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని ధనయజ్ఞమే ధ్యేయంగా ఉండడంతో జల యజ్ఞాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
పశ్చిమ ప్రాంత రైతులకు జీవనాడి అయిన ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం నకు చంద్రబాబు నాయుడు తన హాయంలో వేలకోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే జగన్ పనులు ప్రారంభించక నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు తీరని అన్యాయం చేశారని దుయ్య పడ్డారు. పెండింగు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇప్పె నరసప్ప, తెలుగు మహిళ నాయకురాలు గోకారమ్మ,రోజా ఆర్ట్స్ ఉసేని, కే.ఎం.డి.అబ్దుల్ జబ్బర్, కంపాడు చిన్న రంగన్న, మైనార్టీ నాయకులు గోరా భాష, జోహార్ అబ్బాస్, ఆఫ్గాన్ వలి భాష, మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, ధన తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. 'ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు' నినాదంతో వేడుకలు!
తాజావార్తలు
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
-
Dhanush: ధనుష్ బర్త్డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
-
Ind vs SL: ‘జడేజా’ రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!