Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి!
- పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓటమి
- పిచ్ విషయంలో ఫోకస్ పెడతాం
- తప్పకుండా లక్నో అభిమానులను అలరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్లో తమకు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓడిపోయింది.
గాయాలతో ఎల్ఎస్జీ పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నప్పుడు.. స్పిన్కు అనుకూలంగా పిచ్ను తయారుచేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. వీటిపై ఎల్ఎస్జీ మెంటార్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘సొంత మైదానంలో ఈ ఫలితం నిరాశపర్చింది. టీమ్లు అన్ని తమ హోం గ్రౌండ్లో పిచ్ను అనుకూలంగా తయారుచేసుకుంటాయి. లక్నో పిచ్ క్యూరేటర్ మాత్రం అలా ఆలోచించినట్లు లేదనిపిస్తోంది నాకు. పంజాబ్ క్యూరేటరే ఈ పిచ్ రూపొందించినట్లుంది. ఈ అంశాలపై మేం ఫోకస్ పెడతాం. పిచ్ విషయంలో ఇకపై పొరపాట్లు జరగవని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: Shreyas Iyer Record: ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
‘అభిమానులు మామీద ఎన్నో అంచనాలు పెట్టుకొని మైదానానికి వస్తారు. తొలి మ్యాచ్లోనే జట్టు ఓడిపోవడం వల్ల చాలా నిరాశపడ్డారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడం సరైంది కాదు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం. మాకు ఇక్కడ ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి. అభిమానులను తప్పకుండా అలరిస్తాం. ఇలాంటి టోర్నీలలో పాజిటివ్ మైండ్సెట్తో ఉండాలి. పరుగులు చేయాలనే ఆకలి ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించాలి. ఆటలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. వచ్చే మ్యాచ్లలో విజేతగా నిలుస్తాం’ అని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!