సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్లో తమకు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.…