Electoral Bonds : డీఎంకేకి భారీగా విరాళమిచ్చిన లాటరీ కింగ్.. పార్టీకి వచ్చిన వాటిలో ఆయనదే టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electoral Bonds : ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల విషయం ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధిక డబ్బును విరాళంగా అందించిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్క డీఎంకే పార్టీకి రూ.509 కోట్లు విరాళంగా అందించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పార్టీ డిఎంకె ఎలక్టోరల్ బాండ్ల నుండి మొత్తం రూ. 665 కోట్ల విరాళాన్ని అందుకుంది. ఇందులో ఎక్కువ భాగం ఫ్యూచర్ గేమింగ్ నుండి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎస్బిఐ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్కు అందజేసిందని.. ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో మొత్తం సమాచారాన్ని పబ్లిక్గా ఉంచింది. న్యాయస్థానం సూచనల మేరకు రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ కంపెనీ ఎంత విరాళం అందజేసిందో సీల్డ్ కవరులో ఎన్నికల కమిషన్కు తెలియజేశాయి.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డీఎంకే మొత్తం రూ.656.5 కోట్ల విరాళాన్ని అందుకుంది. వీటిలో 77 శాతం విరాళాలు ఫ్యూచర్ గేమింగ్ నుండి వచ్చాయి. దీని యజమాని శాంటియాగో మార్టిన్ లాటరీ కింగ్గా ప్రసిద్ధి చెందాడు. ఫ్యూచర్ గేమింగ్ 2019-20, 2022-23 మధ్య ఈ విరాళాన్ని అందించింది. ఈ కాలంలో డీఎంకేకు విరాళాలు అందించిన వారిలో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (105 కోట్లు), ఇండియా సిమెంట్ (14 కోట్లు), సన్ టీవీ నెట్వర్క్ (10 కోట్లు), త్రివేణి (8 కోట్లు), రామ్కోస్మెంట్ (5 కోట్లు) ఉన్నాయి. ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం రూ.656.5 కోట్ల విరాళం అందింది. ఎన్నికల కమిషన్కు సమాచారం అందించగా, ఈ పథకం కింద దాత పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని డీఎంకే తెలిపింది. అయితే, కంపెనీలు బాండ్లు ఇచ్చినప్పుడు వారు కూడా సమాచారం ఇవ్వడానికి ఎటువంటి షరతులు పెట్టలేదు. సుప్రీంకోర్టు సూచనల తర్వాత దాతలను సంప్రదించగా వారు పూర్తి సమాచారం ఇచ్చారు.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
Read Also:Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు తిరు కల్యాణ మహోత్సవం..
డీఎంకేతో పాటు జేడీఎస్, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి తమ సమాచారాన్ని అందించాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా జీడీఎస్ మొత్తం రూ.89.7 కోట్లు పొందింది. ఇందులో అత్యధికంగా సహకరించిన కంపెనీల్లో మేఘా ఇంజనీరింగ్ ఒకటి. దీంతో పాటు ఎంబసీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్ కూడా విరాళాలు అందించాయి. 2019లో ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రూ.5 కోట్ల విరాళం అందిందని ఏఐఏడీఎంకే తెలిపింది. ఇది కాకుండా లక్ష్మీ మెషిన్ వర్క్స్ నుంచి రూ.కోటి ఎలక్టోరల్ బాండ్లు, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి రూ.5 లక్షలు వచ్చాయి.
కాగా ఎస్పీ, జేడీయూ రూ.10 కోట్ల విరాళం గురించి చెప్పగా, ఎవరు ఇచ్చారో కూడా తమకు తెలియదన్నారు. తమ కార్యాలయంలో సీలు వేసిన కవరులో ఈ ఎలక్టోరల్ బాండ్ దొరికిందని పార్టీలు తెలిపాయి. భారతీ ఎయిర్ టెల్, శ్రీ సిమెంట్ లిమిటెడ్ రూ. 1, 2 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చాయని జేడీయూ తెలిపింది. తమ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేకుండానే రూ.10 కోట్ల విలువైన బాండ్ ను పోస్టు ద్వారా పంపినట్లు ఎస్పీ చెబుతున్నారు.
Read Also:Israel: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్
తాజావార్తలు
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!