Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
కావలసిన పదార్థాలు:
* ఎండు మిరపకాయలు (గుంటూరు మిర్చి): 50 గ్రాములు
* ధనియాలు: 30 గ్రాములు
* జీలకర్ర: 1 టీస్పూన్
* మెంతులు: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో సహా): పావు కప్పు
* పసుపు: అర టీస్పూన్
* ఇంగువ: పావు టీస్పూన్
* కల్లుప్పు (లేదా సాల్ట్): రుచికి సరిపడా
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను శుభ్రంగా తుడిచి, మధ్యలోకి తుంపుకోవాలి. ఇలా తుంపడం వల్ల వేయించేటప్పుడు గింజలు లోపల వరకు చక్కగా వేగి కమ్మని రుచి వస్తుంది. తర్వాత స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలను వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు వేయించాలి. అవి కాస్త వేగాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టౌ ఆపేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన మిర్చి, ధనియాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా పావు కప్పు వెల్లుల్లి రెబ్బలను (పొట్టుతో సహా) వేసి మిక్సీని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకుండా కారప్పొడిలో కలిసిపోయేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట రెండు నెలల వరకు, ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
దోశ మీద ఈ కారప్పొడిని చల్లి, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందంటే నమ్మకండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మటి కారంపొడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.
READ ALSO: Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?