Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
కావలసిన పదార్థాలు:
* ఎండు మిరపకాయలు (గుంటూరు మిర్చి): 50 గ్రాములు
* ధనియాలు: 30 గ్రాములు
* జీలకర్ర: 1 టీస్పూన్
* మెంతులు: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో సహా): పావు కప్పు
* పసుపు: అర టీస్పూన్
* ఇంగువ: పావు టీస్పూన్
* కల్లుప్పు (లేదా సాల్ట్): రుచికి సరిపడా
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను శుభ్రంగా తుడిచి, మధ్యలోకి తుంపుకోవాలి. ఇలా తుంపడం వల్ల వేయించేటప్పుడు గింజలు లోపల వరకు చక్కగా వేగి కమ్మని రుచి వస్తుంది. తర్వాత స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలను వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు వేయించాలి. అవి కాస్త వేగాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టౌ ఆపేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన మిర్చి, ధనియాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా పావు కప్పు వెల్లుల్లి రెబ్బలను (పొట్టుతో సహా) వేసి మిక్సీని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకుండా కారప్పొడిలో కలిసిపోయేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట రెండు నెలల వరకు, ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
దోశ మీద ఈ కారప్పొడిని చల్లి, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందంటే నమ్మకండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మటి కారంపొడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.
READ ALSO: Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!