Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Recipes: సాధారణంగా కారప్పొడిలో రకరకాల పప్పులు వాడుతుంటారు. కానీ, పత్యం ఉండే వారు లేదా పప్పులు పడని వారు కూడా తినగలిగేలా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ధనియాలు, ఎండు మిరపకాయలతో కమ్మని కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- Ragi Punugulu - Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
కావలసిన పదార్థాలు:
* ఎండు మిరపకాయలు (గుంటూరు మిర్చి): 50 గ్రాములు
* ధనియాలు: 30 గ్రాములు
* జీలకర్ర: 1 టీస్పూన్
* మెంతులు: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు (పొట్టుతో సహా): పావు కప్పు
* పసుపు: అర టీస్పూన్
* ఇంగువ: పావు టీస్పూన్
* కల్లుప్పు (లేదా సాల్ట్): రుచికి సరిపడా
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను శుభ్రంగా తుడిచి, మధ్యలోకి తుంపుకోవాలి. ఇలా తుంపడం వల్ల వేయించేటప్పుడు గింజలు లోపల వరకు చక్కగా వేగి కమ్మని రుచి వస్తుంది. తర్వాత స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలను వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు వేయించాలి. అవి కాస్త వేగాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టౌ ఆపేయాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన మిర్చి, ధనియాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా పావు కప్పు వెల్లుల్లి రెబ్బలను (పొట్టుతో సహా) వేసి మిక్సీని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకుండా కారప్పొడిలో కలిసిపోయేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ కారప్పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట రెండు నెలల వరకు, ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు నెలల వరకు తాజాగా ఉంటుంది.
దోశ మీద ఈ కారప్పొడిని చల్లి, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందంటే నమ్మకండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఈ కమ్మటి కారంపొడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.
READ ALSO: Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!