AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Lokayukta: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ కేసును చాలా తక్కువ సమయంలో పరిష్కరించారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి . 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం చూపించారు. 1962లో భర్త మృతితో పెన్షన్ కోసం 60 ఏళ్లుగా పోరాడుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణికి న్యాయం జరిగేలా తీర్పును ఇచ్చారు. 60 ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంతో ఆమె 2021 లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్షణ రెడ్డి.. 60 ఏళ్ల పెన్షన్ రూ.15.70 లక్షల బకాయిలతో సహా పెన్షన్ చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులకు ఆదేశించారు. రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు. 60 ఏళ్లుగా పోరాడిన ఆమెకు న్యాయం జరగడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Gorantla Madhav: పార్లమెంట్లో దాడి.. ఎంపీ గోరంట్ల మాధవ్ సాహసం
Also Read
ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గతంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన ఫిర్యాదుల్లో 9,141 కేసులు విచారణ చేశారు.. అలాగే తీర్పులు వెల్లడించారు. 2019 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ లోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడంతో ఆ బాధ్యతలనూ ఆయనే నిర్వర్తించారు. ఇలా లోకాయుక్త కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సాంకేతికంగా రెండు రకాలుగా విభజించినా తీర్పులు మాత్రం ఒక్కరే ఇచ్చారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి 2020లో 1,928, 2021లో 2,307, 2022లో 2,874, 2023లో 2వేలకు పైగా కేసుల్లో తీర్పులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!