Lok Sabha Election: లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఒవైసీ.. త్వరలోనే మరో కీలక నిర్ణయం
Lok Sabha Election: లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్గా మారాయి. ఎన్నికల ప్రకటన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా యాక్టివ్గా మారింది. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు.
అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఒవైసీ, ఔరంగాబాద్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా ఇంతియాజ్ జలీల్, కిషన్గంజ్ నుంచి అక్తరుల్ ఇమాన్ పోటీ చేస్తారని చెప్పారు. అదే సమయంలో ఒవైసీ స్వయంగా హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అభ్యర్థులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చర్చిస్తున్నారని.. త్వరలో అక్కడ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏఐఎంఐఎం నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై ఒవైసీ ప్రస్తుతానికి చెప్పలేదు. గతంలో సయ్యద్ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఆరు స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ముంబై, ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్, ధూలేతో పాటు మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలోని విదర్భ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుంది.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
Read Also:Premalu : దుమ్ముదులిపేస్తున్న ప్రేమలు మూవీ.. తెలుగులో కలెక్షన్స్ అన్ని కోట్లా?
బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అభ్యర్థులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చర్చిస్తున్నారని, త్వరలో అక్కడ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. బీహార్లోని 11 స్థానాల్లో AIMIM తన అభ్యర్థులను నిలబెట్టనుంది. దీంతో పాటు ఈసారి ఉత్తరప్రదేశ్లో కూడా పార్టీ తన హస్తాన్ని చాటనుంది. బీహార్, యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒవైసీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైసీ అభ్యర్థి అయితే ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్లను చీల్చవచ్చునని భావిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, అక్తరుల్ ఇమాన్ బీహార్ అసెంబ్లీ ఎమ్మెల్యే, ఒవైసీ హైదరాబాద్ నుంచి ఎంపీగా ఉన్నారు.
Read Also:Kuno National Park : కునోలో ఆరు పిల్లలకు జన్మనిచ్చిన గామిని.. వరల్డ్ రికార్డు నమోదు
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!