Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి ప్రధానంగా విద్యార్థుల నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. ప్రదర్శనకారులు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని కంగ్లా కోట సమీపంలో నిరసన కొనసాగింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, పరిస్థితిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, పోలీసు సిబ్బంది లాఠీచార్జి చేసి ఆందోళనకారులపై బాష్పవాయువు షెల్స్ను ప్రయోగించారు. అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు, వారిలో కొందరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Also Read: Most Visited Island: ప్రపంచంలో ఎక్కువ మంది వెళ్లే ద్వీపం.. ఎందుకు అక్కడకు వెళ్తారో తెలుసా?
ఫిజామ్ హేమ్జిత్ (20), హిజామ్ లింతోంగంబి (17) అనే విద్యార్థులు జులై 6 నుంచి కనిపించకుండా పోయారు. ఆ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందులో ఒక ఫొటోలో కొంత మంది సాయుధులు వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి ఉంచగా.. వారి వెనుక సాయుధులు కన్పిస్తున్నారు. ఆ ఫోటోలో విద్యార్థులు ఇద్దరు గడ్డిపై కూర్చుకున్నారు. మరో ఫోటోలో విద్యార్థుల మృతదేహాలను పొదల మధ్యలో పడవేసి కన్పించింది. విద్యార్థుల హత్యల నేపథ్యంలో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపినందుకు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మంగళవారం విద్యార్థి సంఘాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విద్యార్థుల మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మంగళవారం నుండి తాజా రౌండ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో ఘర్షణ పడ్డారు. కనీసం 45 మంది నిరసనకారులు గాయపడ్డారు.
Also Read: Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
నేరస్తులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్సింగ్ తెలిపారు. ఇద్దరు యువకుల హత్య కేసును సీబీఐకి అప్పగించారు. మణిపూర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇంఫాల్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మకంగా ఉండవచ్చని ఊహించి మోహరించారు. అలాగే, కొత్త నిరసనల నేపథ్యంలో వచ్చే ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం మళ్లీ విధించింది.
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం మొత్తం రాష్ట్రాన్ని “డిస్టర్బ్డ్ ఏరియా”గా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) కింద 19 నిర్దిష్ట పోలీస్ స్టేషన్ ప్రాంతాలు మినహా మొత్తం రాష్ట్రాన్ని “డిస్టర్బ్డ్ ఏరియా”గా ప్రకటించారు. వివిధ తీవ్రవాద/తిరుగుబాటు గ్రూపుల హింసాత్మక కార్యకలాపాలు మొత్తం మణిపూర్ రాష్ట్రంలో పౌర పరిపాలనకు సహాయంగా సాయుధ బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఓ ప్రకటనను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర యంత్రాంగం సామర్ధ్యం దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఆరు నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?