Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి ప్రధానంగా విద్యార్థుల నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. ప్రదర్శనకారులు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని కంగ్లా కోట సమీపంలో నిరసన కొనసాగింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, పరిస్థితిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, పోలీసు సిబ్బంది లాఠీచార్జి చేసి ఆందోళనకారులపై బాష్పవాయువు షెల్స్ను ప్రయోగించారు. అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు, వారిలో కొందరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది.
Also Read
Also Read: Most Visited Island: ప్రపంచంలో ఎక్కువ మంది వెళ్లే ద్వీపం.. ఎందుకు అక్కడకు వెళ్తారో తెలుసా?
ఫిజామ్ హేమ్జిత్ (20), హిజామ్ లింతోంగంబి (17) అనే విద్యార్థులు జులై 6 నుంచి కనిపించకుండా పోయారు. ఆ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందులో ఒక ఫొటోలో కొంత మంది సాయుధులు వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి ఉంచగా.. వారి వెనుక సాయుధులు కన్పిస్తున్నారు. ఆ ఫోటోలో విద్యార్థులు ఇద్దరు గడ్డిపై కూర్చుకున్నారు. మరో ఫోటోలో విద్యార్థుల మృతదేహాలను పొదల మధ్యలో పడవేసి కన్పించింది. విద్యార్థుల హత్యల నేపథ్యంలో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపినందుకు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మంగళవారం విద్యార్థి సంఘాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విద్యార్థుల మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మంగళవారం నుండి తాజా రౌండ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో ఘర్షణ పడ్డారు. కనీసం 45 మంది నిరసనకారులు గాయపడ్డారు.
Also Read: Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
నేరస్తులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్సింగ్ తెలిపారు. ఇద్దరు యువకుల హత్య కేసును సీబీఐకి అప్పగించారు. మణిపూర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇంఫాల్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మకంగా ఉండవచ్చని ఊహించి మోహరించారు. అలాగే, కొత్త నిరసనల నేపథ్యంలో వచ్చే ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం మళ్లీ విధించింది.
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం మొత్తం రాష్ట్రాన్ని “డిస్టర్బ్డ్ ఏరియా”గా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) కింద 19 నిర్దిష్ట పోలీస్ స్టేషన్ ప్రాంతాలు మినహా మొత్తం రాష్ట్రాన్ని “డిస్టర్బ్డ్ ఏరియా”గా ప్రకటించారు. వివిధ తీవ్రవాద/తిరుగుబాటు గ్రూపుల హింసాత్మక కార్యకలాపాలు మొత్తం మణిపూర్ రాష్ట్రంలో పౌర పరిపాలనకు సహాయంగా సాయుధ బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఓ ప్రకటనను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర యంత్రాంగం సామర్ధ్యం దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఆరు నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!