Life Imprisonment: దళిత బాలికపై అత్యాచారం, ఆపై వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి జీవిత ఖైదు
- ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో
- దళిత బాలికపై అత్యాచారం
- నేరస్థుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ (ఏడీజీసీ) ఫణీంద్ర కుమార్ త్రిపాఠి తెలిపారు. అక్కడ ఆమెను నాశనం చేసాడని, తన చర్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను కూడా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆపై సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానిని వైరల్గా చేసాడు. అంతేకాదు బాలికను చంపేస్తానని బెదిరించాడు కూడా.
Also Read: Bangladesh: ఇస్కాన్ బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్తో సోషల్ మీడియా ప్రచారం..
Also Read
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలికకు అసభ్యకరమైన వీడియో గురించి తెలిసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ వీడియో వైరల్గా మారి పరువు తీయడంతో ఆమె షాక్కు గురైంది. దీని తరువాత, ఆమె నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం వెలుపల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (బెదిరింపు), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 554 (ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో దాడి చేయడం) కింద కేసు నమోదు చేశారు. దీనితో పాటు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, షెడ్యూల్డ్ కులాలు – షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం నిబంధనలు కూడా విధించబడ్డాయి.
Also Read: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ
ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా నిందితుడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. న్యాయమూర్తి నిందితుడికి 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు ఆదేశం మేరకు శిక్షను మరో నెల పొడిగిస్తామని తెలిపారు. కోర్టు ఈ నిర్ణయంపై బాధితరాలు వారు సంతృప్తి వ్యక్తం చేసారు.
తాజావార్తలు
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?