Life Imprisonment: దళిత బాలికపై అత్యాచారం, ఆపై వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి జీవిత ఖైదు
- ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో
- దళిత బాలికపై అత్యాచారం
- నేరస్థుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ (ఏడీజీసీ) ఫణీంద్ర కుమార్ త్రిపాఠి తెలిపారు. అక్కడ ఆమెను నాశనం చేసాడని, తన చర్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను కూడా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆపై సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానిని వైరల్గా చేసాడు. అంతేకాదు బాలికను చంపేస్తానని బెదిరించాడు కూడా.
Also Read: Bangladesh: ఇస్కాన్ బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్తో సోషల్ మీడియా ప్రచారం..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలికకు అసభ్యకరమైన వీడియో గురించి తెలిసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ వీడియో వైరల్గా మారి పరువు తీయడంతో ఆమె షాక్కు గురైంది. దీని తరువాత, ఆమె నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం వెలుపల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (బెదిరింపు), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 554 (ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో దాడి చేయడం) కింద కేసు నమోదు చేశారు. దీనితో పాటు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, షెడ్యూల్డ్ కులాలు – షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం నిబంధనలు కూడా విధించబడ్డాయి.
Also Read: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ
ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా నిందితుడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. న్యాయమూర్తి నిందితుడికి 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు ఆదేశం మేరకు శిక్షను మరో నెల పొడిగిస్తామని తెలిపారు. కోర్టు ఈ నిర్ణయంపై బాధితరాలు వారు సంతృప్తి వ్యక్తం చేసారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!