Life Imprisonment: దళిత బాలికపై అత్యాచారం, ఆపై వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి జీవిత ఖైదు
- ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో
- దళిత బాలికపై అత్యాచారం
- నేరస్థుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ (ఏడీజీసీ) ఫణీంద్ర కుమార్ త్రిపాఠి తెలిపారు. అక్కడ ఆమెను నాశనం చేసాడని, తన చర్యకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను కూడా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆపై సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానిని వైరల్గా చేసాడు. అంతేకాదు బాలికను చంపేస్తానని బెదిరించాడు కూడా.
Also Read: Bangladesh: ఇస్కాన్ బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్తో సోషల్ మీడియా ప్రచారం..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలికకు అసభ్యకరమైన వీడియో గురించి తెలిసిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ వీడియో వైరల్గా మారి పరువు తీయడంతో ఆమె షాక్కు గురైంది. దీని తరువాత, ఆమె నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం వెలుపల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (బెదిరింపు), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 554 (ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో దాడి చేయడం) కింద కేసు నమోదు చేశారు. దీనితో పాటు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, షెడ్యూల్డ్ కులాలు – షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం నిబంధనలు కూడా విధించబడ్డాయి.
Also Read: Relationship Tips: ఈ విషయాలు వైవాహిక జీవితాన్ని నాశనం చేయొచ్చు.. జాగ్రత్త సుమీ
ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా నిందితుడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. న్యాయమూర్తి నిందితుడికి 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు ఆదేశం మేరకు శిక్షను మరో నెల పొడిగిస్తామని తెలిపారు. కోర్టు ఈ నిర్ణయంపై బాధితరాలు వారు సంతృప్తి వ్యక్తం చేసారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!