LIC GST Notice : ఎల్ఐసికి షాక్.. రూ. 806 కోట్లు చెల్లించాలని జీఎస్టీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది. నోటీసు ప్రకారం ఇందులో రూ.365.02 కోట్ల జీఎస్టీ, రూ.404.7 కోట్ల పెనాల్టీ, రూ.36.5 కోట్ల వడ్డీ ఉన్నాయి. ఈ నోటీసుపై అప్పీలు దాఖలు చేస్తామని ఎల్ఐసీ తెలిపింది. ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ GST నోటీసును అందుకుంది. ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించిన నాన్-రివర్సల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
Read Also:RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
Also Read
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
భారీ జీఎస్టీ నోటీసు అందుకున్న తర్వాత, నిర్ణీత గడువులోగా ముంబైలోని కమిషనర్ ముందు అప్పీల్ దాఖలు చేస్తామని ఎల్ఐసీ తెలిపింది. అయితే, ఈ జిఎస్టి నోటీసు కంపెనీ ఆర్థిక, కార్యాచరణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వ సంస్థ తెలిపింది. 2023 అక్టోబర్లో దాదాపు రూ. 37 వేల కోట్ల జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ను ఎల్ఐసీకి పంపారు. ప్రభుత్వ కంపెనీ 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో కొన్ని ఇన్వాయిస్లపై 18 శాతానికి బదులుగా 12 శాతం చొప్పున పన్ను చెల్లించిందని ఆరోపించారు. శ్రీనగర్కు చెందిన రాష్ట్ర ఆదాయపు పన్ను అధికారి కంపెనీపై రూ.10462 కోట్ల జీఎస్టీ, రూ.20 వేల కోట్ల జరిమానా, రూ.6,382 కోట్ల వడ్డీ విధించారు.
Read Also:Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
అక్టోబరు, సెప్టెంబర్లో కూడా నోటీసులు
ఇంతకు ముందు కూడా ఎల్ఐసీకి అక్టోబర్లో రూ.84 కోట్లు, సెప్టెంబర్లో రూ.290 కోట్ల ఆదాయపు పన్ను పెనాల్టీ నోటీసులు పంపారు. సోమవారం బిఎస్ఇలో ఎల్ఐసి షేరు 3.1 శాతం లాభంతో రూ.858.35 వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!