LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది. నోటీసు ప్రకారం ఇందులో రూ.365.02 కోట్ల జీఎస్టీ, రూ.404.7 కోట్ల పెనాల్టీ, రూ.36.5 కోట్ల వడ్డీ ఉన్నాయి. ఈ నోటీసుపై అప్పీలు దాఖలు చేస్తామని ఎల్ఐసీ తెలిపింది. ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ GST నోటీసును అందుకుంది. ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించిన నాన్-రివర్సల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
Read Also:RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
భారీ జీఎస్టీ నోటీసు అందుకున్న తర్వాత, నిర్ణీత గడువులోగా ముంబైలోని కమిషనర్ ముందు అప్పీల్ దాఖలు చేస్తామని ఎల్ఐసీ తెలిపింది. అయితే, ఈ జిఎస్టి నోటీసు కంపెనీ ఆర్థిక, కార్యాచరణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వ సంస్థ తెలిపింది. 2023 అక్టోబర్లో దాదాపు రూ. 37 వేల కోట్ల జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ను ఎల్ఐసీకి పంపారు. ప్రభుత్వ కంపెనీ 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో కొన్ని ఇన్వాయిస్లపై 18 శాతానికి బదులుగా 12 శాతం చొప్పున పన్ను చెల్లించిందని ఆరోపించారు. శ్రీనగర్కు చెందిన రాష్ట్ర ఆదాయపు పన్ను అధికారి కంపెనీపై రూ.10462 కోట్ల జీఎస్టీ, రూ.20 వేల కోట్ల జరిమానా, రూ.6,382 కోట్ల వడ్డీ విధించారు.
Read Also:Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
అక్టోబరు, సెప్టెంబర్లో కూడా నోటీసులు
ఇంతకు ముందు కూడా ఎల్ఐసీకి అక్టోబర్లో రూ.84 కోట్లు, సెప్టెంబర్లో రూ.290 కోట్ల ఆదాయపు పన్ను పెనాల్టీ నోటీసులు పంపారు. సోమవారం బిఎస్ఇలో ఎల్ఐసి షేరు 3.1 శాతం లాభంతో రూ.858.35 వద్ద ముగిసింది.