Gangster Lawrence Bishnoi: జైలు నుంచి వీడియో కాల్లో పాక్ గ్యాంగ్స్టర్కు ఈద్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
- గుజరాత్ జైలు నుంచి పాకిస్థానీ గ్యాంగ్స్టర్కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన లారెన్స్ బిష్ణోయి
- సోషల్ మీడియాలో వీడియా వైరల్
- పలు ప్రశ్నలకు తావిస్తోన్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Lawrence Bishnoi: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. ఈ వీడియో వైరల్గా మారిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ను సబర్మతి జైలులో ఉంచారు. ప్రత్యేక సెక్యూరిటీ సెల్లో ఉంచారు, అయినా మొబైల్ అక్కడికి ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also: Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్లు..
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ఈద్ శుభాకాంక్షలు తెలిపే వీడియో వైరల్..
శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. లారెన్స్ మొదట పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేశాడని, ఇప్పుడు బిష్ణోయ్ పాకిస్థానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పాడని, అది కూడా గుజరాత్ జైలు నుండి అని ఆయన రాసుకొచ్చారు. జైలులో ఉన్నా ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సబర్మతి జైలు అధికారులు, గుజరాత్ పోలీసులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై గుజరాత్ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన లేదు. మధ్యాహ్నం సబర్మతి జైలు డీఎస్పీ ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని చెప్పారు. ఈ వీడియో కూడా ఏఐ జనరేట్ కావచ్చు, ఏడాదిలో మూడు ఈద్లు ఉన్నాయి, ఇది ఏ ఈద్ వీడియో అని చెప్పడం కష్టమని అన్నారు.
Read Also: Sukesh Chandrasekhar: తీహార్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్కు ఎయిర్ కూలర్.. కోర్టు ఆదేశం
ప్రస్తుతం, లారెన్స్ బిష్ణోయి సబర్మతి జైలులో ఉన్నాడు. వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ను గుజరాత్ ఏటీఎస్ రిమాండ్కు తరలించి అప్పటి నుంచి సబర్మతి జైలులో ఉంచారు. లారెన్స్ను పూర్తి భద్రతతో ఈ జైలులో ఉంచారు. ప్రస్తుతం అతను ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!