Gangster Lawrence Bishnoi: జైలు నుంచి వీడియో కాల్లో పాక్ గ్యాంగ్స్టర్కు ఈద్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
- గుజరాత్ జైలు నుంచి పాకిస్థానీ గ్యాంగ్స్టర్కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన లారెన్స్ బిష్ణోయి
- సోషల్ మీడియాలో వీడియా వైరల్
- పలు ప్రశ్నలకు తావిస్తోన్న వీడియో
Gangster Lawrence Bishnoi: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. ఈ వీడియో వైరల్గా మారిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ను సబర్మతి జైలులో ఉంచారు. ప్రత్యేక సెక్యూరిటీ సెల్లో ఉంచారు, అయినా మొబైల్ అక్కడికి ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also: Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్లు..
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
ఈద్ శుభాకాంక్షలు తెలిపే వీడియో వైరల్..
శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. లారెన్స్ మొదట పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేశాడని, ఇప్పుడు బిష్ణోయ్ పాకిస్థానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పాడని, అది కూడా గుజరాత్ జైలు నుండి అని ఆయన రాసుకొచ్చారు. జైలులో ఉన్నా ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సబర్మతి జైలు అధికారులు, గుజరాత్ పోలీసులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై గుజరాత్ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన లేదు. మధ్యాహ్నం సబర్మతి జైలు డీఎస్పీ ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని చెప్పారు. ఈ వీడియో కూడా ఏఐ జనరేట్ కావచ్చు, ఏడాదిలో మూడు ఈద్లు ఉన్నాయి, ఇది ఏ ఈద్ వీడియో అని చెప్పడం కష్టమని అన్నారు.
Read Also: Sukesh Chandrasekhar: తీహార్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్కు ఎయిర్ కూలర్.. కోర్టు ఆదేశం
ప్రస్తుతం, లారెన్స్ బిష్ణోయి సబర్మతి జైలులో ఉన్నాడు. వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ను గుజరాత్ ఏటీఎస్ రిమాండ్కు తరలించి అప్పటి నుంచి సబర్మతి జైలులో ఉంచారు. లారెన్స్ను పూర్తి భద్రతతో ఈ జైలులో ఉంచారు. ప్రస్తుతం అతను ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?