Munugode By Poll : నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మునుగోడు ముచ్చట జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం మునుగోడుపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీకీ, తిరిగి తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్కు, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న టీఆర్ఎస్కు ఈ మునుగోడు ఉప ఎన్నిక కీలకమని చెప్పొ్చ్చు. అయితే.. ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నేటి సాయంత్రంతో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 17ను చివరితేదీగా నిర్ణయించారు. అయితే.. నవంబర్ 3న పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది.
Also Read : హెబ్బా.. ఏంటబ్బా.. ఈ అందాల ఆరబోత..
Also Read
ఇదిలా ఉంటే… బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు సైతం నామినేషన్లు వేశారు. అయితే.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..