Mafia Arrest: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా.. రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ
- ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా
- రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ డీల్ కుదర్చడంతో సబ్ రిజిస్ట్రార్.. ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Also Read:CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
Also Read
ఐతే బాధితులు.. కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. RWS డీఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన రాజకీయ నేత ఉష్కమల్ల రఘుపతి, రిమ్స్లో ఫార్మసిస్టుగా పనిచేసే బెజ్జవార్ సంజీవ్కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అంతేకాదు డబ్బులు లంచం తీసుకుని రిజిస్ట్రేషన్ అయిన భూమినే యజమానితో కాకుండా మరో వ్యక్తితో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్పై కేసు నమోదు చేసినట్లు మావల సీఐ స్వామీ వెల్లడించారు.
ఆదిలాబాద్లో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠా భరతం పట్టారు పోలీసులు. బాధితుడు మిల్లింద్ కొర్తల్వార్ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ అశోక్కు రూ. 7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ జరిగినట్లు నిర్థారించారు. బాధితుల పిర్యాదులో 447, 427, 420, 467, 468, 471, 120-B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!