Mafia Arrest: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా.. రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ
- ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా
- రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ డీల్ కుదర్చడంతో సబ్ రిజిస్ట్రార్.. ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Also Read:CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
Also Read
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
ఐతే బాధితులు.. కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. RWS డీఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన రాజకీయ నేత ఉష్కమల్ల రఘుపతి, రిమ్స్లో ఫార్మసిస్టుగా పనిచేసే బెజ్జవార్ సంజీవ్కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అంతేకాదు డబ్బులు లంచం తీసుకుని రిజిస్ట్రేషన్ అయిన భూమినే యజమానితో కాకుండా మరో వ్యక్తితో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్పై కేసు నమోదు చేసినట్లు మావల సీఐ స్వామీ వెల్లడించారు.
ఆదిలాబాద్లో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠా భరతం పట్టారు పోలీసులు. బాధితుడు మిల్లింద్ కొర్తల్వార్ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ అశోక్కు రూ. 7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ జరిగినట్లు నిర్థారించారు. బాధితుల పిర్యాదులో 447, 427, 420, 467, 468, 471, 120-B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!