Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కుమారస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, కుమారస్వామి గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించిన తన స్పందనలో, ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తోందనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని స్పష్టం చేశారు.
Rashid Khan: ఘనంగా పెళ్లిచేసుకున్న స్టార్ అల్ రౌండర్.. హాజరైన క్రికెటర్లు!
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
అతను తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29వ తేదీన మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలు , ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇక కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి గురించి మాట్లాడతే, ఇప్పటివరకు రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసులను త్వరలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పునరుద్ధరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాక, కార్మికుల బయోమెట్రిక్ డేటాను త్వరలో పునరిద్ధరించనున్నామని కుమారస్వామి తెలిపారు.
Tirumala: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు… తిరుమలలో ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ
గేట్ పాస్ వ్యవస్థతో పాటు, అవసరమైన సౌకర్యాలను కొనసాగించేందుకు అన్ని పక్షాలీ చర్చల సమయంలో అంగీకరించాయని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తోందనే ఆరోపణలు అసత్యం అని, ప్రభుత్వ రంగ సంస్థలను సమర్ధంగా నిర్వహించడం ద్వారా గత మూడేళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందని మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా, బాధిత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?