KTR: దళితబంధుని కూడా కాపీ కొడతారేమో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతోందని, దళిత బంధుని కూడా కాపీ కొడతారేమోనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన దళిత బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.5 65 ఏళ్ళలో కాని పనులు ఎన్నో ఆరు ఏళ్ళలో చేసుకున్నాం అన్నారు.
రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తూ అండగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఓ రిఫార్మర్ ఓ ట్రాన్స్ ఫార్మర్ గా ఉండే నాయకుడు. సమాజంలోని అసమానతలు తొలిగి సమానత్వం కలిగించేలా ప్రభుత్వం పని చేస్తుంది. దేవుడు పుట్టించినప్పుడు కులం పెట్టలేదు..అందరికీ ఒకే శరీరం ఇచ్చాడు. తెలివితేటలు, ప్రతిభ ఎవడబ్బ సొత్తు కాదు. మనమే కులం మతం అని పుట్టించుకుని పంచాయితీ లు పెట్టుకుంటున్నాం అన్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
దేవుడి సృష్టించిన మనుషులే కులం మతం అంటూ ఘర్షణలు పెట్టుకుని దిగ జారిపోతున్నాం. 1985లో భారత దేశం చైనా ఒకేలా ఉండేవి. 35 ఏళ్ళలో చైనా వాళ్ళు తెలివిగా ఉండి అమెరికా జపాన్ లతో పోటీ పడి దూసుకుపోతున్నారు. మన ఎకానమీ కంటే ఆరురెట్లు చైనా ఎకానమీ ముందు స్థానంలోకి వెళ్ళింది. చైనా లో కులం మతం పంచాయితీలు వదిలి పెట్టుబడులు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. మత పిచ్చి మత గజ్జితో మనదేశంలో అభివృద్ధి కుంటుబడింది. సిద్దిపేటలో అప్పట్లోనే కేసీఆర్ దళిత జ్యోతి కార్యక్రమం పెట్టారు. ఒక విప్లవాత్మక మార్పుగా దళిత బంధు పథకం తెచ్చారు కేసీఆర్.
Read Also: KTR: బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్
20 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వండి అని బండి సంజయ్, మోడీలని కోరుతున్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తప్ప బీజేపీ వాళ్ళకు ఏమీ తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. భారత దేశంలోని దళిత బిడ్డలకు దిక్సూచిలా దళిత బంధు నిలుస్తుందన్నారు. పీఎం కిసాన్ ఎట్లా కాపీ కొట్టి పెట్టారో దళిత బంధు కూడా కాపీ కొట్టి దేశంలో పెట్టే పరిస్థితి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. అందరూ వాహనాలు కొని గిరాకీ లేక అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. 10 లక్షలతో మీ వ్యాపారం అభివృద్ధి జరిగేలా చూసుకోవాలని దళిత బంధు లబ్ధిదారులకు కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..