KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం లోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ రెండేళ్ల లో ఏమన్నా జరిగింది అంటే మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సు మాత్రమే అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని.. మగవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజు తున్నారని తెలిపారు. నిన్న సీఎం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఆయన ఓటర్లను బెదిరిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చక్రవర్తి లాగా ఫీల్ అవుతున్నారు.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ అభిమాని. మాగంటి గోపీనాథ్ ఆకాల మరణం చెందితే వచ్చిన ఎన్నిక ఇదని గుర్తు చేశారు.. తమ పార్టీ గోపినాథ్ భార్యకు టికెట్ ఇచ్చిందని.. ప్రచారంలో ఆమె గోపీనాథ్ గుర్తు వచ్చి ఏడిస్తే మంత్రులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
READ MORE: Allu Mega Families: వివాదాల ప్రచారం అంతా ఒట్టిదే
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?