KTR : దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. అరెస్ట్ కూడా చేయొచ్చు
- 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు.. ఏమీ తేల్చలేదు
- 3 సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా వస్తాను
- దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. అరెస్ట్ కూడా చేయొచ్చు
- జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులతో తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని ఆరోపించిన ఆయన, జైలుకు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ‘‘విచారణ పేరుతో ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏం తేల్చారు? నాకు ముందే తెలుసు.. ఫార్ములా ఈ-రేసు కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని. అయినా నాకు భయం లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జైలుకు వెళ్లడంలో ఎలాంటి భయం లేదు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకెళ్లాను. ఈ అంశాన్ని నాలుగు గోడల మధ్య విచారణకు పరిమితం చేయకుండా, అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు,” అని అన్నారు.
Ayesha Khan : చీరలో నాజూకైన ఒంపు సొంపులతో అదరగొడుతున్నఆయేషా ఖాన్
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ‘‘ప్రపంచానికి అభాసుపాలైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ పని ఏదీ చేయలేకపోయింది. రైతుబంధును ఎలక్షన్ బంధుగా మార్చేశారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. మేము చట్టాన్ని గౌరవిస్తాం. కావున ఏసీబీ పిలిస్తే 30 సార్లు అయినా విచారణకు హాజరవుతా,’’ అని తేల్చిచెప్పారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల బాట పట్టారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మేము వారి తరపున నిలబడి, ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంను నిరంతరం నిలదీస్తూ ఉంటాం. జై తెలంగాణ’’ అంటూ నినాదాలు చేస్తూ ఏసీబీ కార్యాలయం వైపు బయలుదేరిన కేటీఆర్, లై డిటెక్టర్ టెస్టుకు కూడా తాను సిద్ధమేనని సవాలు విసిరారు.
Ponguleti Srinivas Reddy : తమ ప్రభుత్వంలో కక్ష సాదింపు చర్యలు ఉండవు
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!