NTV Telugu Site icon

KTR : హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగుగోలు ప్రభుత్వమే చూసుకోవాలి

Ktr

Ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు అన్నారు కేటీఆర్‌. గత ఎనమిది నెలల్లో  36 మంది చనిపోయారని, హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల బాగుగోలు ప్రభుత్వమే చూసుకోవాలన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో 500 మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, గత ప్రభుత్వంలో ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్‌.

Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం

అంతేకాకుండా..’ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులాలపై కొత్తగా కమిటీ వేసి కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని అందిస్తాం. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో ఆహారం ఇవ్వండి. ప్రతి జిల్లా నుండి కలెక్టర్లు గురుకులాలను దత్తత తీసుకొని వారానికి ఒకసారి పర్యవేక్షించాలి. వెయ్యి గురుకుల హాస్టల్ లో ఆరున్నర లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఎక్కడన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం