Musi River: గోదావరి నీళ్లను మూసిలోకి తేవాలని ప్రయత్నం చేశాము: కేటీఆర్
- నాగోల్ లో STP ని గ్రేటర్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలన
- కేటీఆర్ ఆధ్వర్యంలో STP లను గ్రేటర్ ఎమ్మెల్యేలు పరిశీలన.
- కేటీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్.
Musi River: శనివారం నాడు నాగోల్ లో STPని గ్రేటర్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో STP లను గ్రేటర్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. నగరంలో 320 MLD సామర్ధ్యంతో అతిపెద్ద నాగోల్ STP నిర్మించారు. తమ ప్రభుత్వంలో నిర్మాణము పూర్తి అయిన ఈ STP ని వెంటనే ప్రారంభం చేయాలని డిమాండ్ చేసారు వారు. ఈ సందర్బంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణరావు, కాలేరు వెంకటేష్, లక్ష్మరెడ్డి, వివేకానందలు ఉన్నారు.
Jan Suraj Party Meeting: ప్రశాంత్ కిషోర్ పార్టీ సమావేశంలో టికెట్ పంపిణీపై రచ్చ రచ్చ
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ సందర్బంగా కేటీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. నాగోల్ ఉన్న STP భారతదేశంలోనే అతి పెద్దదని, హైదరాబాద్ కు మూసి నది ఒక వరమని ఆయన అన్నారు. అయితే, గత ప్రభుత్వాల వల్లే మూసి ఈ దుస్థితని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేసారు. అందుకు గాను.. అవును, గతంలో రేవంత్ రెడ్డి పనిచేసిన, ఇప్పుడు ఉన్న పార్టీలే మూసి దుర్గంధంకు కారణమని అన్నారు. బిఆర్ఎస్ వచ్చిన వెంటనే 2015లో మూసి పునరుజ్జీవనం మొదలు పెట్టామని, మొదటి దశలో రూ.3866 కోట్లతో STPల నిర్మాణం చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా చేయాల్సింది ఏమి లేదని, కేవలం ప్రారంభం చేయడం మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికీ సీఎం చేసే పని అదే.. మనం నిర్మిస్తే ఆయన ప్రారంభం చేస్తున్నాడని, మొత్తం పూర్తి అయిన ప్రక్షాళనకు చేసేది ఏమి లేదంటూ పేర్కొన్నారు.
IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్
మూసి పైన 15 బ్రిడ్జ్లు కట్టడానికి ప్లాన్ చేశామని, ఈ నీళ్లు ఎంత శుద్ది చేసినా.. వాటిని తాగలేమని అన్నారు. అందుకే గోదావరి నీళ్లను మూసి లోకి తేవాలని ప్రయత్నం చేశామని ఆయన అన్నారు. దేశంలో వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం డబ్బులను మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకోసం హైడ్రాను, మూసి ఎన్నుకున్నాడని.. మమ్మల్ని మూసి పక్కన మూడు నెలలు ఉండమని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. అయితే, మాకు మూసి కొత్త ఏమి కాదని.. మేము చిన్నప్పుడు సికింద్రాబాద్ నింబోలి అడ్డలో ఉన్నామని.. అది మూసి పక్కనే ఉంటుందని తెలిపారు. సీఎం మహబూబ్ నగర్ నుంచి వచ్చాడని.. నేను ఇక్కడ లోకల్ వాడినే అంటూ..
మూసి పక్కన ఉన్నవాళ్ళకి లేని బాధ రేవంత్ రెడ్డికి ఎందుకు అంటూ ప్రశ్నించారు.
- Tags
- BRS Party
- ktr
- MLAs
- musi river
- Nagole STP
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో