KTR: కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట తప్పారని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకండి. అభివృద్ధి కాముకులను ప్రోత్సాహించండి అని ప్రజలను కోరారు.
65 ఏళ్లలో పరిష్కారం కానీ తాగు నీటి, కరెంట్ సమస్యలకు కేసీఆర్ సర్కార్ పరిష్కారం చూపిందని ఆయన అన్నారు. గతంలో తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది. 40 లక్షల మందికి , రూ.10 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నాం అని వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం అని అన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపారు.
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఏడాదికి 5 లక్షల మందికి విద్యనందిస్తున్నామని.. ఇంతటి సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అనే నానుడి ఉండేది.. పేదబిడ్డ పెళ్లికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీని అందిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 నుంచి 56 శాతానికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మంది రైతులకు రూ.50 వేల కోట్లు రైతు బంధు అందించామని వెల్లడించారు. .సోమశిల సిదేదశ్వరం వంతెనతో ఆంధ్రాకు హైదరాబాద్ కు జంక్షన్ లా కొల్లాపూర్ మారనుందని అన్నారు. అమరగిరిని ఏకో టూరిజం కింద అభివృద్ది చేస్తామని..ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పుతామని.. ఉద్యాన వన పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
-
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!