KTR: కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట తప్పారని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకండి. అభివృద్ధి కాముకులను ప్రోత్సాహించండి అని ప్రజలను కోరారు.
65 ఏళ్లలో పరిష్కారం కానీ తాగు నీటి, కరెంట్ సమస్యలకు కేసీఆర్ సర్కార్ పరిష్కారం చూపిందని ఆయన అన్నారు. గతంలో తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది. 40 లక్షల మందికి , రూ.10 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నాం అని వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం అని అన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపారు.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఏడాదికి 5 లక్షల మందికి విద్యనందిస్తున్నామని.. ఇంతటి సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అనే నానుడి ఉండేది.. పేదబిడ్డ పెళ్లికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీని అందిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 నుంచి 56 శాతానికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మంది రైతులకు రూ.50 వేల కోట్లు రైతు బంధు అందించామని వెల్లడించారు. .సోమశిల సిదేదశ్వరం వంతెనతో ఆంధ్రాకు హైదరాబాద్ కు జంక్షన్ లా కొల్లాపూర్ మారనుందని అన్నారు. అమరగిరిని ఏకో టూరిజం కింద అభివృద్ది చేస్తామని..ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పుతామని.. ఉద్యాన వన పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!