KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T.R) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతూ కేటీఆర్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు.
సీఎం రేవంత్ వాడుతున్న భాష, చేస్తున్న వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తగిన విధంగా లేవని విమర్శించారు. పనిచేయని నాయకులే ఎక్కువగా మాట్లాడుతారని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. తెలంగాణను తానే పాలిస్తున్న సీఎం రాష్ట్రాన్నే విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో తెలంగాణకు గౌరవం లేదని చెప్పే ముఖ్యమంత్రి అక్కడికి పదేపదే ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పెద్దగా సహకారం లేకపోయినా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచామని అన్నారు.
Also Read
రాష్ట్ర అప్పుల విషయంలో కూడా ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పులపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని, తమ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు అధికారికంగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలనలో విఫలమవడం వల్లే గత ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తున్నారని అన్నారు. రైతు బంధు పథకంపై కూడా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతులకు చెల్లించాల్సిన భారీ మొత్తాలు ఇంకా బకాయిగా ఉన్నాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. ఏ అంశంపైనైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. టాపిక్, వేదిక ముఖ్యమంత్రి ఇష్టమని, తన ఆరోపణలను నిరూపించలేకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అదే విధంగా సవాల్ చేసిన వ్యక్తి దానికి కట్టుబడి ఉండే ధైర్యం కూడా చూపించాలని అన్నారు. చివరగా సీఎం రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యానిస్తూ.. ప్రజల సమస్యలను విస్మరించి రాజకీయ ఆరోపణలకే పరిమితమైతే తీవ్ర రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..