Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. కృష్ణంరాజు జిల్లాకు ఎప్పుడొచ్చినా ఆయన తప్పక మొగల్తూరు వచ్చి కొద్దిసేపు ఈ నివాసంలో ఉండటం ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. ఆయన సోదరుడు అంటే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు హైదరాబాదులో మృతి చెందినప్పుడు దహన సంస్కారాలన్నీ అక్కడే పూర్తి చేసి, దిన కార్యక్రమం మాత్రం స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణంరాజు కార్యక్రమం ఎక్కడ జరుపుతారన్నది కూడా మొగల్తూరులో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Rebel star Krishnam Raju: ఎందరికో స్ఫూర్తి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటజీవితం!
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు మొగల్తూరు వాసులు..మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు..ఆయనతో తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన అభిమానులు. కృష్ఱంరాజు మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఉభయ గోదావరి వాసులు, రాజకీయ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి నన్ను కలచివేసింది. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసిన మహనీయులు. కుటుంబ సభ్యులు తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు సోమువీర్రాజు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి క్రియాశీలకంగా చేసి చూపించి న బిజెపి కేంద్ర మంత్రి గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పార్టీ అభివృద్ధి కోసం నాకు ఆయన తో ఎనలేని అనుబంధం గుర్తుకుతెచ్చుకున్నారు సోమువీర్రాజు.
ఉభయగోదావరి జిల్లా నుండి @BJP4Andhra తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. @blsanthosh pic.twitter.com/3JP5rnCYE7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 11, 2022
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!