Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. కృష్ణంరాజు జిల్లాకు ఎప్పుడొచ్చినా ఆయన తప్పక మొగల్తూరు వచ్చి కొద్దిసేపు ఈ నివాసంలో ఉండటం ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. ఆయన సోదరుడు అంటే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు హైదరాబాదులో మృతి చెందినప్పుడు దహన సంస్కారాలన్నీ అక్కడే పూర్తి చేసి, దిన కార్యక్రమం మాత్రం స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణంరాజు కార్యక్రమం ఎక్కడ జరుపుతారన్నది కూడా మొగల్తూరులో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Rebel star Krishnam Raju: ఎందరికో స్ఫూర్తి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటజీవితం!
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు మొగల్తూరు వాసులు..మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు..ఆయనతో తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన అభిమానులు. కృష్ఱంరాజు మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఉభయ గోదావరి వాసులు, రాజకీయ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి నన్ను కలచివేసింది. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసిన మహనీయులు. కుటుంబ సభ్యులు తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు సోమువీర్రాజు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి క్రియాశీలకంగా చేసి చూపించి న బిజెపి కేంద్ర మంత్రి గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పార్టీ అభివృద్ధి కోసం నాకు ఆయన తో ఎనలేని అనుబంధం గుర్తుకుతెచ్చుకున్నారు సోమువీర్రాజు.
ఉభయగోదావరి జిల్లా నుండి @BJP4Andhra తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. @blsanthosh pic.twitter.com/3JP5rnCYE7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 11, 2022
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో