Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. కృష్ణంరాజు జిల్లాకు ఎప్పుడొచ్చినా ఆయన తప్పక మొగల్తూరు వచ్చి కొద్దిసేపు ఈ నివాసంలో ఉండటం ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. ఆయన సోదరుడు అంటే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు హైదరాబాదులో మృతి చెందినప్పుడు దహన సంస్కారాలన్నీ అక్కడే పూర్తి చేసి, దిన కార్యక్రమం మాత్రం స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణంరాజు కార్యక్రమం ఎక్కడ జరుపుతారన్నది కూడా మొగల్తూరులో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Rebel star Krishnam Raju: ఎందరికో స్ఫూర్తి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటజీవితం!
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు మొగల్తూరు వాసులు..మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు..ఆయనతో తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన అభిమానులు. కృష్ఱంరాజు మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఉభయ గోదావరి వాసులు, రాజకీయ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి నన్ను కలచివేసింది. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసిన మహనీయులు. కుటుంబ సభ్యులు తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు సోమువీర్రాజు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి క్రియాశీలకంగా చేసి చూపించి న బిజెపి కేంద్ర మంత్రి గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పార్టీ అభివృద్ధి కోసం నాకు ఆయన తో ఎనలేని అనుబంధం గుర్తుకుతెచ్చుకున్నారు సోమువీర్రాజు.
ఉభయగోదావరి జిల్లా నుండి @BJP4Andhra తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. @blsanthosh pic.twitter.com/3JP5rnCYE7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 11, 2022
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!