Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన స్వస్థలం మొగల్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజుకు మొగల్తూరులో సొంత నివాసం ఉన్నప్పటికీ ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదు. కృష్ణంరాజు జిల్లాకు ఎప్పుడొచ్చినా ఆయన తప్పక మొగల్తూరు వచ్చి కొద్దిసేపు ఈ నివాసంలో ఉండటం ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. ఆయన సోదరుడు అంటే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు హైదరాబాదులో మృతి చెందినప్పుడు దహన సంస్కారాలన్నీ అక్కడే పూర్తి చేసి, దిన కార్యక్రమం మాత్రం స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణంరాజు కార్యక్రమం ఎక్కడ జరుపుతారన్నది కూడా మొగల్తూరులో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Rebel star Krishnam Raju: ఎందరికో స్ఫూర్తి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటజీవితం!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు మొగల్తూరు వాసులు..మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు..ఆయనతో తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన అభిమానులు. కృష్ఱంరాజు మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఉభయ గోదావరి వాసులు, రాజకీయ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి నన్ను కలచివేసింది. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసిన మహనీయులు. కుటుంబ సభ్యులు తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు సోమువీర్రాజు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి క్రియాశీలకంగా చేసి చూపించి న బిజెపి కేంద్ర మంత్రి గా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. పార్టీ అభివృద్ధి కోసం నాకు ఆయన తో ఎనలేని అనుబంధం గుర్తుకుతెచ్చుకున్నారు సోమువీర్రాజు.
ఉభయగోదావరి జిల్లా నుండి @BJP4Andhra తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. @blsanthosh pic.twitter.com/3JP5rnCYE7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 11, 2022
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!