Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీ హిందువుల ప్రతినిధి కాదా..?
Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. యూపీలో బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి భయపడే రాహల్ గాంధీ వాయనాడ్ కు పారిపోయారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముస్లిం, మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయన్న కారణంగానే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా తన వెంట నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో నరేంద్ర మోడీ సర్కారు మాత్రమే ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిందని ఆయన గుర్తు చేశారు.
Read Also: KTR: 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..
Also Read
- Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
- Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
రాష్ట్రంలోనూ బీజేపీదే హవా..
తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 12 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను సాధించబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరి హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని.. కానీ సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, రాఘవేంద్రనగర్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ మల్లారెడ్డి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
-
Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
-
PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
-
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
-
Lakshmi Mittal: ఒకప్పుడు కాంక్రీట్ నేలపై నిద్రించిన లక్ష్మీ మిట్టల్.. నేడు రూ.2.37 లక్షల కోట్ల సంపదతో ఐపీఎల్ జట్టు ఓనర్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!