Komatireddy Venkat Reddy : కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్.. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అమెరికాలో ఉన్నాడని, రెండో దశ ప్రక్రియ మొదలు కాగానే వచ్చాడు కేటీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మాతో పొత్తు పెట్టుకున్నాడని, వైఎస్ వద్దు అన్నా.. ఎదిరించి మాట్లాడామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటే.. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్నాడని, కేటీఆర్ .. మీ తండ్రి మొదటి సభలో చెప్పిన మాటలు విను… కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పిల్లలు చనిపోతున్నారు అని తెలంగాణ ప్రకటన చేశారు సోనియాగాంధీ అని, తెలంగాణ పేరుతో కేటీఆర్.. లక్షల కోట్లకు ఎదిగాడని ఆయన ఆరోపించారు.
Also Read : Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
అంతేకాకుండా.. ‘సోనియా గాంధీని విమర్శించడం మానుకో. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చాం. 20 ఏండ్ల క్రితం 400 అంటే దాని విలువ ఎంతో తెలుసుకో. ఆ రోజుల్లోనే 32 లక్షల ఇండ్లు కట్టించినం. మేము కట్టిన ఇల్లు..ఇప్పుడు 10 లక్షల విలువ. 30 వేల ఇండ్లు కట్టలేదు నువు నీ మోకానికి. కాళేశ్వరం డబ్బుల కోసం కట్టావు. పాలమూరు ప్రాజెక్టు లో ఒక్క మోటార్ కూడా పెట్టలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ మేము 70 శాతం పనులు పూర్తి చేసినం. 2 వేల కోట్లు ఇస్తే పనులు అన్ని పూర్త్జి అయ్యేవి.
Also Read : Rohit Sharma: అరుదైన ఘనత.. వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన ‘హిట్’ మ్యాన్
కేటీఆర్..నీ వెంట ఉన్నది అంతా తెలంగాణ ద్రోహులే. దానం తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. తలసాని.. సబితా.. మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు ఉన్నారు. . మల్లారెడ్డి..పాలు..పూలు తో పాటు భూములు కూడా అమ్ముకున్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. తెలంగాణ ద్రోహులు అంతా ని వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ మీదా ఆరోపణలు చేస్తున్నావు మానుకో. పువ్వాడ అజయ్ కి… తెలంగాణ ఉద్యమం కి సంబంధం ఏముంది. సోనియాగాంధీ ని ఇంకో సారి అంటే పాపం తగులుతోంది కేటీఆర్. సోనియా గాంధీ తో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు. పనికి రాని మాటలు మాట్లాడకు. ఇంటర్ పేపర్ దిద్దడం రాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు కానీ.. మాపై మాట్లాడుతున్నాడు’ అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!