West Bengal : ముగ్గురిని మింగిన డ్రైనేజ్ కెనాల్.. ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లోని కోల్కతా లెదర్ కాంప్లెక్స్లో మ్యాన్హోల్ శుభ్రం చేస్తుండగా కాలువలో పడి ముగ్గురు కార్మికులు ఆదివారం మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, కార్మికుల మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఈ విషయంపై పరిపాలన దర్యాప్తు కొనసాగిస్తోంది.
మున్సిపల్ వ్యవహారాల మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆదివారం మాట్లాడుతూ.. ‘కార్మికులు KMDA (కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) డ్రైనేజీ నెట్వర్క్లో పనిచేస్తున్నారు. ఈ పని లెదర్ కాంప్లెక్స్ యూనిట్లకు సంబంధించినది, కానీ డ్రైనేజీ వ్యవస్థలోని ఒక భాగంలో ఇంత పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఎలా పేరుకుపోయాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. విష వాయువుల వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Also Read
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
Read Also:Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా..?
ఒకరిని రక్షించడానికి వెళ్ళిన మరో ఇద్దరు కూడా..
దర్యాప్తు పూర్తయిన తర్వాతే వ్యక్తుల మరణానికి అసలు కారణం తెలుస్తుందని ఫిర్హాద్ హకీమ్ అన్నారు. కానీ ఈ వ్యక్తులు కాలువలో ఉన్న విష వాయువుల కారణంగా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం కోల్కతాలోని బంటాలా ప్రాంతంలోని లెదర్ కాంప్లెక్స్లో జరిగింది. మ్యాన్హోల్ శుభ్రం చేస్తుండగా మురుగు కాలువలో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
కోల్కతా లెదర్ కాంప్లెక్స్లోని లెదర్ యూనిట్ల వ్యర్థాలతో నిండిన మ్యాన్హోల్ను శుభ్రం చేస్తుండగా ఒక కార్మికుడు జారిపడి 20 అడుగుల కింద పడిపోయాడు. దీని తరువాత, మరో ఇద్దరు కార్మికులు అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు, కానీ వారు కూడా కాలువలో పడిపోయారు. విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది గంటసేపు గాలింపు తర్వాత ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
Read Also:Jagga Reddy: రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడం లేదు..
మ్యాన్హోల్లోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించారా ?
మరణించిన కార్మికులను ఫర్జాన్ షేక్, హసీ షేక్, సుమన్ సర్దార్గా గుర్తించారు. మ్యాన్హోల్ కవర్ కింద పనికి వెళ్తున్నప్పుడు ముగ్గురు మాస్క్ లు ధరించారా లేదా అనేది తెలియదు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆ ముగ్గురు కార్మికులు కార్పొరేషన్ బృందంలో భాగం కాదని అన్నారు. వారు లెదర్ కాంప్లెక్స్ నిర్వహణ బృందంలో ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!