Maharastra : చనిపోయాడని తీసుకెళ్తుండగా… గుంతలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం, విషయం కస్బా బావ్డా ప్రాంతానికి చెందినది. డిసెంబరు 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లోన కుప్ప కూలిపోయాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావ్డా ప్రాంతంలో స్పీడ్ బేకర్ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేళ్లు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతడిని మళ్లీ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also:Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
పాండురంగ్ బంధువు మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేసాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో, మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది, దీని కారణంగా అందరూ తీవ్ర షాక్కు గురయ్యారు. పాండురంగ్ వేళ్లు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం. ఆశ్చర్యపోయాము.’’ అన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!