Maharastra : చనిపోయాడని తీసుకెళ్తుండగా… గుంతలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం, విషయం కస్బా బావ్డా ప్రాంతానికి చెందినది. డిసెంబరు 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లోన కుప్ప కూలిపోయాడు.
Also Read
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావ్డా ప్రాంతంలో స్పీడ్ బేకర్ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేళ్లు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతడిని మళ్లీ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also:Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
పాండురంగ్ బంధువు మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేసాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో, మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది, దీని కారణంగా అందరూ తీవ్ర షాక్కు గురయ్యారు. పాండురంగ్ వేళ్లు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం. ఆశ్చర్యపోయాము.’’ అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!