Maharastra : చనిపోయాడని తీసుకెళ్తుండగా… గుంతలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం, విషయం కస్బా బావ్డా ప్రాంతానికి చెందినది. డిసెంబరు 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లోన కుప్ప కూలిపోయాడు.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావ్డా ప్రాంతంలో స్పీడ్ బేకర్ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేళ్లు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతడిని మళ్లీ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also:Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
పాండురంగ్ బంధువు మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేసాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో, మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది, దీని కారణంగా అందరూ తీవ్ర షాక్కు గురయ్యారు. పాండురంగ్ వేళ్లు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం. ఆశ్చర్యపోయాము.’’ అన్నారు.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!