Kodanda Reddy : నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ
నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో వెనక్కి తీసుకుంటున్న అన్నారు కానీ ఇప్పటికీ మూడు పార్లమెంట్ సమావేశాలు జరిగాయన్నారు. కానీ బిల్లులు వెనక్కి తీసుకోలేదని, నల్ల చట్టాలు తో రైతులు భూములు కౌలు కి ఇవ్వాలి అంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కౌలు కి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలియదని కోదండరెడ్డి మండిపడ్డారు. గోదాముల్లో నిల్వలు ఉండొద్దనే చట్టం కూడా ఎత్తేశారని, అదానీ.. అంబానీకి లాభం చేసే పనిలో మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. నిల్వలు రైతులు.. జవాన్లకు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ ఆలోచన అని, కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారన్నారు. బడా బాబులకు లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉందన్నారు.
Suresh: మొదటి భార్యతో విడిపోవడానికి కారణం అదే.. ఇక రాశీని పెళ్లాడాక..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు.. కేసులు ఎత్తేయాలి అని ఆయన అన్నారు. మద్దతు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకుల ద్వారా అప్పులు రైతులకు ఎక్కువ ఇవ్వాలి అని, పంటల భీమా పథకం పక్కన పెట్టారన్నారు. మద్దతు ధర అడిగే విషయంలో రైతుల సలహాలు కూడా తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మోడీ సర్కారు కి వ్యతిరేకంగా 16వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులను.. కార్మికులను హత్య చేసేలా ఉన్నాయి నల్ల చట్టాలు అని, అన్ని సంఘాల తో కమిటి వేసుకోవాలన్నారు. పార్టీ తరుపున పీసీసీ తో చర్చిస్తామని, ఇందిరా పార్క్ లో భారీ ఎత్తున ధర్నా చేద్దామన్నారు. రైతులను కాపాడుకోవడానికి అందరం సిద్ధం అవ్వాలని, మంత్రులు కూడా ఇందిరా పార్కు కి వస్తారు ధర్నాలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సీపీఐ.. సీపీఎం.. జనసమితి పార్టీ అందరిని కలుపుకుని పోదామన్నారు. నిరసన సక్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటదన్నారు. తర్వాత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. నల్ల చట్టాలు దొడ్డి దారిన అమలు చేసే కుట్ర జరుగుతుందని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడా బాబులకు లబ్ది చేకూర్చే పనిలో ఉన్నారు బీజేపీ నేతలు అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో పెద్ద ర్యాలీ చేయాలని, గ్రామీణ రైతులకు కూడా అర్థం అయ్యేలా నిరసన ఉండాలన్నారు. రైతులకు జరిగే నష్టాన్ని వివరించాలన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!