Kishan Reddy: గద్దర్ లేని పాట మూగబోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ గా మార్చిన గొప్ప గాయకుడు గద్దర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది.. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.. తెలంగాణ సాధన కోసం అంకిత భావంతో పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆయన పేర్కొన్నారు. నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధం గద్దర్ తో ఉంది.. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వారు.. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ మేధావులకు, ఎంతో బాధ కలిగించే ఘటన ఇది అని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
నేను హాస్పిటల్ కు వెళ్లి గద్దర్ తో మాట్లాడాను అని కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కలిసి పోరాటం చేద్దాం అన్నారు.. ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు.. సమస్యల పైన తిరుగు లేనటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు గద్దర్ అని తెలిపారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ ఇచ్చినటువంటి గొప్ప గాయకుడు గద్దర్ అని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: Credit card vs Buy Now Pay Later: ఈ రెండిటిలో ఏది బెస్ట్ ఆప్షన్.. క్రెడిట్ కార్డా లేక పే లేటర్ ?
గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయం అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.. నాతో పాటు పాల్గొన్న అనేక సందర్భాలలో మా జాతీయ నాయకులు అద్వాని, వాజ్ పేయి, వెంకయ్య నాయుడుతో గద్దర్ కు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నిజాం కాలేజీలో అద్వాని బహిరంగ సభకి ముందు వరుసలో కూర్చొని మధ్యలో ముందు వరుసలో కూర్చున్న సందర్భం మర్చిపోలేదు అని చెప్పారు. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!