Kishan Reddy : భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదవాళ్లకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని ఆయన కొనియాడారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావాలని కాంక్షించారని, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారన్నారు.
Also Read : IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
Also Read
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
అంతేకాకుండా.. ‘భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరం. దేశ ప్రజలు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి దీన్ దయాల్. విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ దయాల్ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ, వారి ఆశయాలకు పునరంకితమై పనిచేస్తోంది. పేద ప్రజలకు మేలు జరిగేలా ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది.
Also Read : Jowar Laddu : ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం.. జొన్నలడ్డు తయారీ విధానం..
మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా సేవలందిస్తోంది. దీన్ దయాళ్ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి, ఆచరణలో చూపెడుతోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దీన్దయాళ్ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. దీన్ దయళ్ గారి ఆశయాలకు అనుగుణంగా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా పనిచేస్తాం. అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ రాజకీయాలకు తావివ్వకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకెళ్తాం.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!