IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill and Shardul Thakur Out From IND vs AUS 3rd ODI: ఆదివారం ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాను రాహుల్ సేన 99 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగులుండగానే మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ఇద్దరు భారత స్టార్స్ దూరం అయ్యారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దాంతో అతడు రాజ్కోట్లో జరిగే మూడో వన్డేకు అందుబాటులో ఉండడు. ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి గిల్కు విశ్రాంతి ఇచ్చారట. మరోవైపు ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్కు కూడా మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. గిల్, శార్ధూల్ రెండో వన్డే అనంతరం జట్టుతో కలిసి రాజ్కోట్కు వెళ్లలేదు.
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
Also Read: India-Canada: కెనడాలో ఏటా రూ. 68,000 కోట్లు ఖర్చు పెడుతున్న పంజాబ్ విద్యార్థులు!
శుభ్మన్ గిల్, శార్ధూల్ ఠాకూర్లు తిరిగి గౌహతిలో భారత జట్టుతో కలవనున్నారు. వీరిద్దరూ నేరుగా గువాహటి చేరుకుని.. ప్రపంచకప్ 2023 సన్నద్ధతలో పాల్గొంటారు. సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా ఇంగ్లండ్తో భారత్ వామాప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు మూడో వన్డేకు అందుబాటులో ఉంటారు. సీనియర్ల రాకతో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!