Kishan Reddy: బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..
- బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోంది- కిషన్ రెడ్డి
- మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా..
- దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని సూచించిన కిషన్ రెడ్డి శుక్రవారం కోల్కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి
- ఉద్యోగులు.. ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు
- భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోంది- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సీఐఎల్ పోషిస్తున్న పాత్రను అభినందించిన కిషన్ రెడ్డి.. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
Read Also: Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తించడం బొగ్గు ఉత్పత్తిని చేపడుతూనే.. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు. అనంతరం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. దేశంలో కాపర్ ఎక్స్ప్లొరేషన్లో పనిచేస్తున్న ఏకైక సంస్థ అయిన HCL రానున్న రోజుల్లో దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మరింత ఉత్పత్తిని పెంచడంపై పనిచేయాలన్నారు. GSI కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని సంస్థ సాధించిన ప్రగతిని.. రానున్న రోజుల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
Read Also: RBI: మైక్రోసాఫ్ట్ సమస్యపై ఆర్బీఐ కీలక ప్రకటన
తదనంతరం GSI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ల్యాండ్స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను కేంద్రమంత్రి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కొండప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే వీటిని గుర్తించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. సానుకూల ఫలితాలు వచ్చాయని రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు. అనంతరం కేంద్రమంత్రి కోల్కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. రేపు (శనివారం) నగరంలో జరగనున్న క్రిటికల్ మినరల్ హ్యాకథాన్ & రోడ్ షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిచనున్నారు.
తాజావార్తలు
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!