Kishan Reddy: అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఉండబోతుంది.. కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు.. అందరికీ సమ న్యాయం జరగాల్సి ఉంది.. బడుగు బలహీనవర్గాలకు బీజేపీ పెద్ద పీఠ వేయబోతుంది అని ఆయన తెలిపారు. గజ్వేల్ వెళ్తా అంటే కేసీఆర్ కు ఉలుకు ఎందుకు.. గజ్వేల్ ప్రజలకు అన్ని అందితే ఎందుకు కేసీఆర్ భయ పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Lifestyle : పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
దళితుల అభ్యున్నతి గజ్వేల్ లో జరిగిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ అయన ప్రైవేట్ ఆస్తా.. అపే అధికారం ఎక్కడిది… నిజాం రాసిచ్చార, ఓవైసీ రాసిచ్చారు… అది మీ జాగీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరినో తీసుకొచ్చి చూపారు కదా.. బరితెగింపు గా వ్యవహరిస్తే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది… మాదేమి అషమాసి పార్టీ కాదు అని ఆయన హెచ్చరించారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది.. మెజారిటీ రైతులు అన్యాయంకి గురయ్యారు.. మీరు ప్రకటించిన ఎమ్మెల్యేలు.. దళిత బంధులో కమిషన్, ఇసుక దందా, గ్రానైట్ వ్యాపారంలో కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు.
Read Also: Curd Health Benefits: ప్రతీరోజు పెరుగు తింటే.. ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రభుత్వం అయితే.. కల్వకుంట్ల ప్రభుత్వము వాటాల ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోచుకున్నారు.. ధరణి బాధితులు వందల మంది వచ్చి కలుస్తున్నారు.. ఈ నెల 17 నుంచి మోడీ జన్మదిన వేడుకలు.. తెలంగాణ విమోచన ఉత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నాడు. అధికారికంగా, పార్టీ తరపున నిర్వహిస్తాం.. రజాకార్ల అరాచకాలకు గురైన ప్రాంతాలకు వెళ్తాం.. పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. కృష్ణా యాదవ్ బీజేపీ లో చేరుతారు అని కిషన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!