Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kishan Reddy Said That The Bjp Government Is Going To Come In Exactly One Month The Shape Of The State Is Going To Change

Kishan Reddy: సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది.. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోంది

Published Date :November 3, 2023 , 6:19 pm
By Rajesh Veeramalla
Kishan Reddy: సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది.. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి… సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది… BRS ఓడిపోబోతుంది… కాంగ్రెస్ మూడవ స్థానం లోకి పడిపోతుందని అన్నారు.

CEO Vikas Raj: ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యంత ప్రతష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించారని… ఒక డిస్కవరీ ఛానల్ లో కూడా వచ్చే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. వేలాది కోట్ల రూపాయలు నీళ్ళ పాలైందని… ప్రాజెక్ట్ కుంగిపోతుంటే చూస్తున్నామన్నారు. 2014లో 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభం అన్నారు.. అంతకముందు 30వేల కోట్ల రూపాయలు అన్నారు.. రిడిజైన్ పేరుతో లక్ష 30వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దాని బెనిఫిట్స్ పైన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.

Lawrence: గురువుకే గుదిబండలా మారిన లారెన్స్?

ఇంజినీర్స్ చెబుతున్న ప్రకారం నాణ్యత కరువైందని, మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తం కరప్షన్ తో కూడిన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోయిన చోట 15-20 మధ్యలో కుంగినప్పుడు… తాను కేంద్రానికి ఒక లేఖ రాశానన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఒక అథారిటీని ప్రారంభించామని.. దీని ద్వారా దేశంలో పూర్తిగా ప్రాజెక్ట్ మైంటైనేన్స్ ఎలా ఉందో పర్యవేక్షిస్తుందని తెలిపారు. 20 అంశాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలకు సంబంధించిన జవాబు ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసలు ప్లానింగ్ సరిగ్గా లేదు, పిల్లర్లు సరిగ్గా నిర్మాణం అవ్వలేదు, అసలు పునాది కూడా సరిగ్గా లేదని… అందుకు సింగిల్ స్టోన్ వాడారని, అందుకే బ్రేక్స్ వచ్చాయని అన్నారు.

Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు

మేడిగడ్డ ప్రాజెక్ట్ ముఖ్యమైంది… అదే దెబ్బతింటే మిగితావన్ని నిరుపయోగంగా మారబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కి నీతి నిజాయితీ ఉంటే బ్యారేజ్ అంశంలో నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. అన్ని టాలెంట్ లు ఉన్నాయి… కానీ ప్రాజెక్ట్ కట్టడంలో ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు. 80వేల పుస్తకాలు చదివాడు… అనుభవంతో కట్టాను అన్నాడు కానీ విఫలం అయ్యాడని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. కుంగిపోయిన ప్రాజెక్ట్ పరిష్కారం అయ్యే వరకు ప్రాజెక్ట్ మొత్తం వినియోగించుకొలేని పరిస్థితి ఉందన్నారు. కమిటీ అడిగినా విషయాలని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాస్తుందని… బ్యారేజ్ నిర్మాణం పైన అధ్యయనాలు చెయ్యడానికి కుదరదని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం… బీజేపీ అధికారంలోకి రాగానే మొత్తం విచారణ చేపట్టి ఎవ్వరూ బాధ్యులైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • kcr
  • Kishan Reddy
  • telangana elections 2023

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions