Kishan Reddy : రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు
- నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదు
- ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి
- విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి అని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విదేశాలకు వెళ్ళిన వాజ్ పేయ్.. దేశ ప్రతిష్టను పెంచే విధంగా మాట్లాడారని, ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో చూడండన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని తృణ ప్రాయంగా వదిలేసి ప్రజల మధ్యకు వెళ్ళారని, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు వాజపేయి చేశారన్నారు కిషన్ రెడ్డి. స్వర్ణ చతుర్భుజి పేరుతో 75 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు ప్రారంభించారన్నారు.
Delhi: పార్లమెంటు సమీపంలో.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి.. పరిస్థితి విషమం!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అంతేకాకుండా..’అన్ని జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులకు అటాచ్ చేసే విధంగా నేడు ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవస్థను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి వాజపేయి. వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన పథకం.. హైద్రాబాద్ లోనే ప్రారంభించారు. కేసీఆర్ ఒక్క ఇంటికి కూడా భూమి పూజ చేయలేదు. వాజపేయి బహిరంగ సభలకు వాహనాలు పెట్టకపోయినా.. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేవారు.. వాజపేయి స్ఫూర్తితో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు.. లక్షమంది యువకులను రాజకీయ నాయకులుగా తయారు చేయాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏడాది పాటు వచ్చే డిసెంబర్ 25 వరకు వాజ్ పాయ్ శత జయంతి వేడుకలు కొనసాగుతాయి.. వాజపేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసేవిధంగా పనిచేద్దాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Health: నల్ల జీలకర్ర గురించి లాభాలు తెలుసా..? ఈ సమస్య ఉన్న వారు వాడండి
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?