Delhi: పార్లమెంటు సమీపంలో.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి.. పరిస్థితి విషమం!
- ఢిల్లీలో హృదయ విదారక ఘటన
- పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి
- ప్రస్తుతం పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
READ MORE: Ajay Maken: ఆప్తో పొత్తు ఒక పొరపాటు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఢిల్లీ అగ్నిమాపక శాఖ (DFS) అధికారి మాట్లాడుతూ.. “పార్లమెంట్ హౌస్ ముందు రైలు భవన్ సమీపంలో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు మధ్యాహ్నం 3.35 గంటలకు డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. అనంతరం అగ్నిమాపక దళ వాహనాన్ని సంఘటనా స్థలానికి తరలించాం. పార్లమెంటు సమీపంలో మోహరించిన భద్రతా సిబ్బంది, పలువురు పౌరులు మంటలు ఆర్పారు. అతన్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని తెలిసింది. అతని పేరు జితేంద్రగా గుర్తించాం. వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. జితేంద్ర శరీరం 90 శాతం కాలి పోయింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో అతనిపై నమోదైన కేసు కారణంగా అతను కలత చెందాడని దర్యాప్తులో తేలింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.” అని తెలిపారు.
READ MORE: Health: నల్ల జీలకర్ర గురించి లాభాలు తెలుసా..? ఈ సమస్య ఉన్న వారు వాడండి
కాగా.. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. వాహనాల సోదాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..