Kishan Reddy : ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు
విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసిగూడాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, ఈ దేశంలో అవీనితిరహిత, శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే విజయ సంకల్ప యాత్ర జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 20 తేదిని నుండి ఈ యాత్రలు కొనసాగుతున్నాయని, అంబర్ పేటలో చౌరస్తాలో జరిగే సభతో మన యాత్ర పూర్తి అవుతుందని, కరోనా వంటి కిష్ట సమయంలో దేశాన్ని మోడీ ఎలా కాపాడారో అందరికి తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. నాడు హైదరాబాద్తో పాటు దేశంలోని ముంబై వంటి నగరాలలో పాకిస్థాన్ ISS ఉగ్రవాదుల దాడులను చూశామన్నారు.
మోడీ వచ్చిన తర్వాత దేశం ప్రశాంతంగా మారిందని, భారత్ను ప్రపంచదేశాలు పొగిడే విధంగా చేశారన్నారు. దేశంలో బెస్ట్ లీడర్గా వెలుగొందుతున్నారు. అన్ని సర్వేలలో మోడీ టాప్ లో నిలుస్తున్నారని, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారన్నారు. అందరికి కడుపు నింపడానికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, మరో 5 ఏళ్ళ పాటు ఉచిత బియ్యాన్ని పంపణి చేయనున్నారన్నారు. అయిష్మాన్ భారత్ ఆరోగ్య భీమా అందిస్తున్నారన్నారు. దేశంలో ప్రతి మహిళకు వంట గ్యాస్ అందించిన చరిత్ర మోడీది అని ఆయన కొనియాడారు.
Also Read
అంతేకాకుండా.. ‘గ్రామ పంచాయితీల అభివృద్దికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. బొగ్గు,2జీ కుంభకోణాలతో రూ.12 లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ దొచింది. దీంతో ప్రజలు అవీనితిరహిత పాలకుడు కావాలి అని మోడీని ఎన్నుకున్నారు. మోడీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవీనితి కూడా జరగలేదు. ఎవరూ కూడా మోదీని అవినీతిపరుడు అని వెలెత్తి చూపలేరు. దేశ ప్రజల భవిష్యత్, పిల్లల భవిష్యత్, పేదల సంక్షేమం కోసం కంకణం కట్టుకొని నీతి నిజాయితీతో పని చేసే నాయకుడు మోడీ.
ఈ ఎన్నికల్లో మోడీది మరోసారి ఆశీర్వదిద్దాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో