Kishan Reddy : మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు జరగనున్నాయన్నారు. మోడీ సర్కార్ 3వ సారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలందరి మనసులో మోడీయే రావాలని ఉందని, కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల అవీనితి జరిగిందన్నారు. అనాడు సోనియా రిమెట్ కంట్రోల్లో మన్మోహన్ సింగ్ పనిచేశారని, ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోడీ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. మోడీ సమర్ధవంతమైన నాయకుడని, 500 ఏళ్ల కల అయినా అయోధ్య రామాలయాన్ని మోడీ నిర్మించారన్నారు. అధికారంలోకి వస్తే రామమందిరం నిర్మిస్తామని చెప్పామని, నిర్మించామన్నారు. ఇది మోడీ వల్ల సకారమైందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచారు మోడీ అని, అలాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
తెలంగాణలో 17కు 17 బీజేపీ గెలవాలని, మజ్లీస్ సీటు కూడా బీజేపీ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. అసదుద్దీన్ పార్లమెంట్కు వెళ్ళకుండా అడ్డుకోవాలని, మజ్లీస్ పార్టీ ప్రజా సామ్యానికి, అభివృద్ది్కి వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. మెట్రో రైల్ను అడ్డుకుంది.. మజ్లీస్ అని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచనా మజ్లిస్ చేరి, పోలీసు వ్యవస్థను తన అధీనంలో పెట్టుకుంటుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలని ప్రజలను కొరుతున్నానని, ముఖ్యంగా బీజేపీకి హైదరాబాద్ నుండి ఓ ఏంపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!