Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబేతరుల్ని ఎప్పుడు గౌరవించలేదు
- కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్
- బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు
- హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి అని, సోషలిస్టు పార్టీ నీ కూడా జనతా పార్టీ లో విలీనం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబేతరుల్ని ఎప్పుడు గౌరవించలేదని, భారత రత్న లు వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారని, ఆ కుటుంబం దృష్టిలో రాజకీయాలు అంటే కాంగ్రెస్ .. కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబమన్నారు కిషన్ రెడ్డి. పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కుతుందని, ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టీ ఏ విధంగా ఇక్కడ రాజకీయ మార్పు తీసుకొచ్చారో… అదే విధంగా కర్పూరి ఠాకూర్ బీహార్ లో తీసుకొచ్చారన్నారు కిషన్ రెడ్డి.
Donald Trump: ట్రంప్ ప్రకటనతో భారతీయ విద్యార్థుల్లో వణుకు.. వారి బాధలు వారి మాటల్లోనే…
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
అంతేకాకుండా..’నెహ్రూ తరవాత దేశం లో అత్యధిక కాలం ప్రధాని గా ఉన్నది నరేంద్ర మోడీ.. మాకు మాత్రమే హక్కు ఉందని ఆ నెహ్రూ కుటుంబం భావన…. ఏనాడూ బడుగు బలహీన వర్గాల గురుంచి పట్టించుకోలేదు కాంగ్రెస్.. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తి…. దేశ రాజకీయాల పై అవగాహన లేని వ్యక్తి రాహుల్ గాంధీ.. అంబేద్కర్ ను మరణించిన తరవాత కూడా వదిలిపెట్టని.. అడుగడుగున ఆయన్ను అవమానించింది… సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ప్రజా స్వామ్యం ఉన్నంత కాలం ఈ దేశం లో రాజ్యాంగం రద్దు కాదు.. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్… కాంగ్రెస్ పాఠాలు, రాహుల్ గాంధీ సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదు.. మీకు అవసరం ప్రజల సర్టిఫికెట్ అవసరం.. దేశ ప్రజలు మోడీ కి సర్టిఫికెట్ ఇచ్చారు..’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?