Kishan Reddy : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరిచిపోయారని, 100 రోజులోనే 6 గ్యారంటీ లను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు ఏమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజెపి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. రేవంత్ అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవ్వుకున్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టెలాగా లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున BJYM నేతలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బిజెపి కే భవిష్యత్ ఉంటుంది. బీఅర్ఎస్ పని అయిపోయింది. పాలక పార్టీకి బి అర్ ఎస్ కొమ్ముకస్తుంది. కాంగ్రెస్ లో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బిజెపి పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలో బిజెపి నుండి పోటీ చేయడానికి యువత సిద్ధంగా ఉండాలి. బీఅర్ ఎస్ కు ఓటు వేసిన కాంగ్రెస్ కు వేసినట్లే. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..