Kishan Reddy : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరిచిపోయారని, 100 రోజులోనే 6 గ్యారంటీ లను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు ఏమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజెపి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. రేవంత్ అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవ్వుకున్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టెలాగా లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున BJYM నేతలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బిజెపి కే భవిష్యత్ ఉంటుంది. బీఅర్ఎస్ పని అయిపోయింది. పాలక పార్టీకి బి అర్ ఎస్ కొమ్ముకస్తుంది. కాంగ్రెస్ లో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బిజెపి పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలో బిజెపి నుండి పోటీ చేయడానికి యువత సిద్ధంగా ఉండాలి. బీఅర్ ఎస్ కు ఓటు వేసిన కాంగ్రెస్ కు వేసినట్లే. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్కప్ బరిలోకి.!
- Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం.. కారణమిదే!
- Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్కు ముందే అనూహ్య నిర్ణయం..
- Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
తాజావార్తలు
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్కప్ బరిలోకి.!
-
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
-
Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం.. కారణమిదే!
-
Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్కు ముందే అనూహ్య నిర్ణయం..
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
ట్రెండింగ్
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!