Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Fires On Cm Revanth Reddy 3

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే

Published Date :October 20, 2024 , 7:11 pm
By Gogikar Sai Krishna
  • సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి
  • ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?
  • ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..?
  • ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోసం వస్తుంది
  • ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? : కిషన్‌ రెడ్డి
Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే
  • Follow Us :
  • google news
  • dailyhunt

పోలీసులది దౌర్జన్య దమనకాండ కాంగ్రెస్ దురహంకారానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిందూ నిరసనకారులపై లాఠీచార్జీ సహించరానిదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే అని కిషన్‌ రెడ్డి అన్నారు. అన్యమతస్థుల ప్రార్థనాలయాల్లో శబ్దాలు పోలీసులకు, సీఎంకు వినిపించవా? గుడిపక్కనే అంతమంది క్లాసుల పేరిట ఉంటే పోలీసులేంచేస్తున్నారు? వీకీపీడీయా, గూగూల్ ద్వారా సమాధానాలు రాయాలా? నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడరెందుకు? పరీక్షల్లో ఒకే విధానం ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. నిరుద్యోగ యువకులు గత వారం రోజులుగా అశోక్ నగర్ లో నిరసన కార్యక్రమాలు చేపడితే సీఎం మాటలు చేతలు దాటుతున్నాయే తప్ప సచివాలయం గేటు దాటటడం లేదని, నిరుద్యోగ, రైతాంగ, పేదలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, ఎన్నికలలో హామీలు ఏ ఒక్కటి సచివాలయం గేటు దాటడం లేదన్నారు కిషన్‌ రెడ్డి. దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా? నిరసనాకారులు టెర్రరిస్టులా? అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని, వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై కేసులు పెట్టించారన్నారు. అన్యమతస్థులకు సంబంధించిన ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Kadapa: బద్వేల్ ఇంటర్ విద్యార్థిని ఘటన కేసులో సంచలన విషయాలు..

అంతేకాకుండా..’ఇతర రాష్ర్టల నుంచి వచ్చిన వారు అక్కడ మతపరమైన శిక్షణ పొంది హిందూ దేవాలయంపై ఒక వ్యక్తి దాడి చేస్తే ఎందుకు సీఎం, కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, అమ్మవారిని కొలిస్తే, హిందూ దేవుళ్ల పండుగలు దేవున్ని కొలిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు బాధ వేస్తుంది. ముత్యాలమ్మ నిరసనకారులపై ఎందుకంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక కార్యకర్తకు 9 కుట్లు పడ్డాయి. దేవాలయ ధ్వంసం వంటి వీడియోలు చూసిన ఏ హిందువుకైనా ఆగ్రహం రాకుండా, ఆక్రోశం రాకుండాఉంటుందా? అసలు మోటివేషన్ క్లాసుల పేరుతో అంతమంది గుడిపక్కనే హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుంది అశోక్ నగర్ లైబ్రరీలో సీఎం కాకముందు కబుర్లు చెప్పారన్నారు. ఇప్పుడేమో ఏకంగా లాఠీచార్జీకి దిగుతారా? వారంతా మన పిల్లలే అని వారితో ఒకసారి చర్చిస్తే పోయేదేముందని వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి. సీఎం తీరు చూస్తే బీఆర్ఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తుందన్నట్లు స్పష్టం అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ విధమైన మార్పు లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ టు సేమ్ వీరి విధానాలతో నిరుద్యోగ యువత ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధైర్యం లేకుంటే పోలీసులు వెంట బెట్టుకెళ్లండి.. వీకీపీడియా, గూగూల్ ను ఆధారంగా తీసుకొని పరీక్షలు రాయమంటారా? తెలుగు అకాడమీ పుస్తకాల జవాబులు చెల్లవంటే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో 29 విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందులో దాపురికం లేకపోతే ఎందుకు పిలిచి మాట్లాడరు’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • CM Revanth Reddy
  • congress
  • Kishan Reddy

తాజావార్తలు

  • Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?

  • Bihar: బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి! అభిమానులు సంబరాలు

  • 10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!

  • Freelance While Employed: ఓ కంపెనీలో జాబ్ చేస్తూ.. ఫ్రీలాన్స్‌గా పనిచేయడం చట్టవిరుద్ధమా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

  • EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. ఇక వేగంగా డబ్బులు.. ఈ ఒక్క పని చేస్తేనే..

ట్రెండింగ్‌

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions