Kishan Reddy : తెలంగాణతో సంబంధం ఉన్న 5 కారిడార్లకు లక్ష కోట్లు
- తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 5,200 కి.మీ.కి పెరుగుదల
- భూ సేకరణే ప్రధాన అవరోధం అని కిషన్ రెడ్డి వ్యాఖ్య
- ఈ నెల 5న గడ్కారీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన అంశం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ. 2014 వరకు రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం 5,200 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విస్తరణ తెలంగాణలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారుల అనుసంధానానికి తోడ్పడింది.
India Pakistan: పాక్ రక్షణ మంత్రి బెదిరింపులు: సింధునదిపై ‘‘డ్యామ్’’లను కూల్చేస్తాం..
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రయాణానికి సంబంధించిన దూరం తగ్గించబడుతుంది. దీనితో పాటు, హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారికి 6 లేన్ల నిర్మాణం కూడా జరుగుతుందని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూ సేకరణ సమస్యలు తలెత్తుతున్నాయి. భూ సేకరణ ఆలస్యం అయితే, నిర్మాణం కూడా ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంత త్వరగా భూమి సేకరించబడితే, అంత త్వరగా రహదారుల నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన అన్నారు.
CPI Narayana: అమరావతి పనులపై నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ బాధ్యత మోడీదే..!
తెలంగాణ రాష్ట్రంలో వేలాదిమంది కోట్లతో వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి 5 ప్రధాన కారిడార్ల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 5,416 కోట్ల రూపాయలతో 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం , శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. నితిన్ గడ్కారీ అదిలాబాద్ , హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!