Kishan Reddy : గిరిజన యునివర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరు పెట్టి కేంద్రం తెలంగాణ సంస్కృతిని గౌరవించిందని, యూనివర్సిటీకి ఇచ్చిన 50 ఎకరాలకు క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మంజూరు చేసిన యునివర్సిటీ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, యూనివర్శిటీ కి భూమి కోసం వెంటపడి, ఉత్తరాలు రాశానన్నారు. గిరిజన యునివర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలుగా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా వారికి అన్యాయం చేశారన్నారు. బట్టకాల్చి మీద వేయడంలో కేసీఆర్ దిట్ట.. ఆస్కార్.. నోబెల్ బహుమతులు ఇవ్వవచ్చని, కృష్ణ వాటర్ పంపిణీ జరగకపోవడానికి ప్రధానకారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : AP CM JAGAN: ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ
Also Read
- గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
అంతేకాకుండా.. ‘అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తె టూరిస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీని మోడీ వస్తె కనీసం కలవడం చేతకాదు కానీ.. పోస్టర్లు వేస్తారు. బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా.? కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ నేనే పెడతా అని కేసీఆర్ చెప్పిన విషయం గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 35 వేల కోట్లతో ప్రారంభించి 55 కోట్ల రూపాయలకు ప్రారంభించారు. 22 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. రిజర్వాయర్లు పూర్తి కాలేదు కానీ ఫోజులు మాత్రం కొడుతున్నారు.
Also Read : Chiranjeevi: ఆయన ఒక మెంటోర్.. ఒక గైడింగ్ ఫోర్స్.. ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్..
రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. సమావేశాల్లో జే.పీ. నడ్డా పాల్గొంటారు. ఎన్నికల ఎజెండా పై ప్రధాన చర్చ జరుగుతుంది. బీఎల్ సంతోష్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ లో అమిత్ షా పర్యటిస్తారు. కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అదిలాబాద్ కి ఎంత కేటాయిస్తున్నారు ? హైదరాబాద్ కు ఎంత కేటాయిస్తున్నారు ? నోరుంది కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అంటే కేటీఆర్ అభద్రత భావంతో ఉన్నారు. ప్రగతి భవన్ లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంటుంది. ప్రధాన మంత్రిని కలవరు.. ఫార్మ్ హౌస్ లో ఉండి కేసీఆర్ విజయం సాధించామని డబ్బా కొట్టుకుంటారు. ఐటీ దాడులు రొటీన్ ఆక్టివిటీ.. ఎన్నికలకు, మాకు సంబంధం లేదు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!