Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kishan Reddy %e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3 %e0%b0%85%e0%b0%ad%e0%b0%bf

Kishan Reddy: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

Published Date :February 16, 2024 , 4:10 pm
By Mahesh Jakki
Kishan Reddy: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్​ పార్టీ ఢిల్లీకి సూట్​ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్​ రాహుల్​ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. అన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక నుంచి సూట్​ కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు వెళ్లల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ దొందు దొందే..
కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు దొందు దొందే అని కిషన్​ రెడ్డి విమర్శించారు. ‘‘ఈ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు మజ్లిస్​ పంచన చేరుతాయి. బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయి. బీఆర్​ఎస్​ పార్టీ, కేసీఆర్​ మీద దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్​ ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్​ పార్టీ కూడా అవినీతి పార్టీ కాబట్టి. సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్​ చేస్తే.. విజిలెన్స్​ పేరుతో కాలయాపన చేస్తున్నది. విజిలెన్స్​ తో అయ్యేది లేదు.. పోయేది లేదు. కాంగ్రెస్​ చెయ్యి బస్మాసుర హస్తం.. చేయ్యి గుర్తుకు ఓటేస్తే.. అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుంది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక వారు జీహెచ్​ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుంది. హైదరాబాద్​ నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా.. జీహెచ్​ఎంసీకి నిధులు ఇవ్వడం లేదు”అని కిషన్​ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Bandi Sanjay: ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు..

మోదీతోనే తెలంగాణ అభివృద్ధి
గత తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్​ స్టేషన్​, రూ. 450 కోట్లతో కాచిగూడ, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం. ఎయిర్​ పోర్టు తరహాలో సికింద్రాబాద్​ స్టేషన్​ డెవలప్​ కానుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలంటే మోదీ నాయకత్వం.. బీజేపీ నాయకత్వం అవసరం. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చారు. వరంగల్​ రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చింది. జోగిలాంబ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్​ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్​ ఆర్​ రోడ్డును మోదీ మంజూరు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్​ చేంజర్​ ​కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్​ కల్పించిన ఘనత మోదీది”అని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం
దేశంలో ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘నిత్యం ఉగ్రవాదుల బాంబులతో రావణకాష్ఠంలా మండే కశ్మీర్​ ​లో 370 ఆర్టికల్​ ఎత్తేసి.. అక్కడ శాంతి నెలకొల్పిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్​ లో ఒకప్పుడు బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల చేతిలో పలువురి హత్యలు జరిగేవి. మోదీ వచ్చిన తర్వాత ఐఎస్​ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. పాక్​ లో ఇండియన్​ కరెన్సీ ముద్రించి భారత్​ లో చెలామణి చేసేవారు. ఇప్పుడు అది ఆగింది. ప్రపంచం దృష్టిలో పాక్​ ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. రొట్టె ముక్క కోసం ఇప్పుడు పాకిస్తా న్​ ​లో ప్రజలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తే.. ప్రభుత్వాలు మౌనంగా ఉండేవి. కానీ మోదీ అలా కాదు.. దేశంలో దాడులు జరిపిన టెర్రరిస్టులను గుర్తించి సర్జికల్​ స్ట్రైక్​ లు, ఎయిర్​ స్ట్రైక్​ లు చేసి వారిని మట్టుబెట్టారు. కాంగ్రెస్​ హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారు. తొమ్మిన్నర ఏండ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. వచ్చే 25 ఏండ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్​ ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధమవ్వాలి”అని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS Party
  • Kishan Reddy
  • Kishan Reddy Fires on Congress
  • latest news

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions