King Charles III: ట్రంప్ బెదిరింపులపై బ్రిటన్ రాజు కీలక వ్యాఖ్యలు.. కెనడా ప్రశంసించిన కింగ్ చార్లెస్..!
King Charles III: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను USAలో 51వ రాష్ట్రంగా కలిపేసేందుకు చేస్తున్న బెదిరింపుల నడుమ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో పార్లమెంటు ప్రారంభ సభలో తన కీలక ప్రసంగంలో కెనడాను శక్తివంతమైన, స్వతంత్ర దేశంగా ప్రశంసించారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఆహ్వానంతో దేశాధిపతిగా హాజరైన చార్లెస్, మారుతున్న అంతర్జాతీయ సంబంధాలు.. అలాగే ముఖ్యంగా అమెరికాతో ఉన్న సంబంధాలపై కామెంట్లు చేసారు.
Read Also: Chandigarh: 1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్ నమోదు..!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రజాస్వామ్యం, చట్టాల పరిపాలన, స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ ఇవన్నీ కెనడియన్లు ఎంతో విలువగా భావించే అంశాలు. వీటిని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. కెనడా ఇప్పుడు ఒక కీలక సమయంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. “ది ట్రూ నార్త్ ఈజ్ ఇండీడ్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ” (కెనడా జాతీయ గీతంలో ఉన్న ఒక లైన్) చెప్పిన రాజు, కెనడా దేశ స్వతంత్రత ఎలాంటిదో స్పష్టం చేశారు. ట్రంప్ కెనడాను అమెరికాకు అనుసంధానించాలన్న అనేక బెదిరింపులకు రాజు నేరుగా స్పందించలేదు. కానీ, ఈ ప్రసంగం మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశిత సంకేతాలు పంపారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!
అలాగే బ్రిటన్ రాజు గ్లోబల్ వాణిజ్యంపై ఆందోళన చెందారు. సంపదను అందించిన ఓపెన్ గ్లోబల్ ట్రేడ్ వ్యవస్థ మారుతోంది. ఇది పరిపూర్ణం కాకపోయినా, గత కొన్నేళ్లుగా కెనడియన్లకు అభివృద్ధిని తెచ్చింది అని అన్నారు. ప్రపంచం ఇప్పుడు ఇది వరకు కాలం కంటే మరింత ప్రమాదకరంగా, అనిశ్చితంగా మారిందని ఆయన హెచ్చరించారు. కెనడా పార్లమెంటు ప్రారంభోత్సవంలో బ్రిటిష్ రాజు హాజరవడం 70 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి. పార్లమెంటు మరమ్మతుల దశలో ఉండగా, ఓటావాలోని పాత రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తాత్కాలిక అధికారి పక్ష నేతలు, స్థానిక ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో