Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా శనివారం సిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఓ మీడియా సంస్థ “దేశంలో విపక్షాల కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరు?” అనే ప్రశ్న సంధించింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “ఈ ప్రశ్న మీలో ఎవరు కోటీశ్వరుడు అవుతారు అన్నట్లుగా మారింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపైన తర్వాత విపక్ష నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు ఉన్నప్పటికీ సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. పదేళ్లపాటు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాం.ఈ విషయాన్ని మర్చిపోయారా?” అని సమాధానమిచ్చారు.
READ MORE: Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని హిందువులు, ముస్లింల మధ్య విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకం కాదని, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పించడం, ద్రవ్యోల్బణం తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. హిమాచల్లో కూడా ప్రధాని మోడీ 2014, 2019లో భారీ వాగ్దానాలు చేశారన్నారు. గెలిచిన తర్వాత తిరిగి చూడలేదని ఆరోపించారు. హిమాచల్ విపత్తులో మునిగినప్పుడు సహాయం చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్రంల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు యత్నిస్తోందని.. హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చూస్తోందన్నారు. ధనబలం, గూండాయిజం, ఈడీ సీబీఐని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!