Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా శనివారం సిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఓ మీడియా సంస్థ “దేశంలో విపక్షాల కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరు?” అనే ప్రశ్న సంధించింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “ఈ ప్రశ్న మీలో ఎవరు కోటీశ్వరుడు అవుతారు అన్నట్లుగా మారింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపైన తర్వాత విపక్ష నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు ఉన్నప్పటికీ సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. పదేళ్లపాటు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాం.ఈ విషయాన్ని మర్చిపోయారా?” అని సమాధానమిచ్చారు.
READ MORE: Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని హిందువులు, ముస్లింల మధ్య విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకం కాదని, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పించడం, ద్రవ్యోల్బణం తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. హిమాచల్లో కూడా ప్రధాని మోడీ 2014, 2019లో భారీ వాగ్దానాలు చేశారన్నారు. గెలిచిన తర్వాత తిరిగి చూడలేదని ఆరోపించారు. హిమాచల్ విపత్తులో మునిగినప్పుడు సహాయం చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్రంల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు యత్నిస్తోందని.. హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చూస్తోందన్నారు. ధనబలం, గూండాయిజం, ఈడీ సీబీఐని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!